English | Telugu

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో  సూపర్ ట్విస్ట్.. షాక్ లో రెండు కుటుంబాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -27 లో..... వేదవతి సామూహిక వివాహం జరిగే దగ్గర ఉంటుంది. వాళ్ళని చూస్తే తమ కొడుకులు గుర్తుకువచ్చి సాగర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నాకు మీరే గుర్తు వచ్చారని అనగానే సాగర్ బాధపడుతాడు. ఆ తర్వాత నర్మద మెడలో సాగర్ తాళి కడతాడు.

మరొకవైపు సామూహిక వివాహాలు చేసుకున్న వాళ్లు రామరాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మనం కూడా అత్తయ్య, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నర్మద అనగానే సాగర్ వద్దని అంటాడు. ధీరజ్ ఒక సలహా ఇవ్వడంతో ఆశీర్వాదం కోసం వెళ్తున్న వారి వెనకాలే ఇద్దరు వెళ్లి రామారాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత చెంచలమ్మతో మాట్లాడి రామరాజు వేదవతిలు అక్కడ నుండి వెళ్లిపోతారు. మరొకవైపు నర్మద, సాగర్ లు వెళ్తుంటే.. మీరెవరు ప్రేమ వివాహం చేసుకున్నారా అని చెంచలమ్మ అడుగుతుంది. పెద్దలని ఒప్పించి చేసుకోవాలి.. వెళ్లి పెద్దలను క్షేమించమని అడిగండి అని చెంచలమ్మ చెప్పగానే.. సరే అని చెంచలమ్మ దగ్గర సాగర్ నర్మదలు ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆ తర్వాత ఇప్పుడు మనం వైజాగ్ వెళదామని సాగర్ అంటాడు. వద్దు మనం మీ ఇంటికి వెళదాం.. చెంచలమ్మ గారు చెప్పింది మర్చిపోయావా అని నర్మద అంటుంది. వద్దని సాగర్ అంటుంటే అప్పుడే ధీరజ్ వచ్చి.. తను చెప్పింది కరెక్ట్ ఇంటికి వెళ్ళాలని అంటాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ లని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి భద్రవతి కుటుంబం ఓవైపు.. రామరాజు కుటుంబం మరోవైపు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.