Read more!

English | Telugu

అమ్మ బర్త్ డే కి రెడీ అయిన హరిత జాకీ!

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి.

హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. తన కొత్త సీరియల్ కోసం తీసుకున్న శారీస్ అని ఒక‌ వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కోసం తీసుకున్మ బంగారం అంటూ ఒక వ్లాగ్, షూటింగ్ నుండి వచ్చాక ఇది నా పరిస్థితి అంటూ మరొక వ్లాగ్ చేయగా అన్నింటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

'పద్మావతి కళ్యాణం' సీరియల్ లో చేస్తున్న హరిత జాకీ.. అక్కడ సెట్ లో అందరు కలిసి దావత్ చేసుకున్నదంతా ఒక వ్లాగ్ చేయగా అది వైరల్ అయింది. ఆ తర్వాత బోనాల సాంగ్ మేకింగ్, అష్ట లక్ష్ములతో ఆషాడం గోరింటాకు పండగ వంటి వ్లాగ్స్ చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది హరిత జాకీ. అయితే తాజాగా అమ్మ బర్త్ డేకి పిల్లలతో కలిసి రెడీ అయ్యాను ఇలా' అనే టైటిల్ తో ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది హరిత జాకీ. వాళ్ళ అమ్మ బర్త్  చాలా స్పెషల్ అని, వాళ్ళ పిల్లలతో పాటు తను కూడా రెడీ అయిందని వీడియోలో చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఓ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.