English | Telugu

భవానిలాగా రెడీ అయిన కృష్ణ.. తనని ఇంప్రెస్ చేసిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -211 లో.. భవాని దగ్గరికి కృష్ణ వెళ్ళి మురారిని పోలీస్ జాబ్ మానేయమన్నామని చెప్పగా.. భవాని వద్దని పోలీస్ డ్యూటీ ఎంత గొప్పదో వివరిస్తుంది. అయితే మురారి తన గదిలో ఉండి భవానితో కృష్ణ ఏం చెప్తుందో, భవాని తనని ఏం అంటుందోనని టెన్షన్ పడుతుంటాడు.

అప్పుడు మురారి దగ్గరికి వచ్చిన కృష్ణ.. సమాజానికి పోలీస్ ఎంత ముఖ్యమో భవాని అత్తయ్య చెప్పిందని, తనపై ఇంకా గౌరవం పెరిగిందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మధు, అలేఖ్యలు తమ గదిలో కాసేపు సరదగా మాట్లాడుకుంటారు. అయితే పూజగదిలోకి ముకుంద వెళ్ళి.. తన ప్రేమ నెరవేరాలని వేడుకుంటుండగా రేవతి చూస్తుంది. ముకుంద వేడుకొని పూజ గది నుండి వెళ్తుండగా తనని ఆపిన ముకుంద.. నీ కాపురం బాగుండాలని కోరుకో, నీ వల్ల వేరే వాళ్ళు బాధపడేలా, విడిపోవాలని కోరుకోకని ముకుందతో చెప్తుంది. "నా ప్రేమలో న్యాయం ఉంది. నా ప్రేమ గొప్పది. నా ప్రేమ త్యాగాన్ని కోరుకోవట్లేదు. ఆ ప్రేమని దక్కించుకోవాలని కోరుకుంటుంది" అని ముకుంద అంటుంది. ఆ తర్వాత ముకుంద వెళ్ళిపోతుంది.

మరొకవైపు భవానిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని కృష్ణ కొత్త ప్లాన్ చేస్తుంది. అది చూసిన మురారి.. మళ్ళీ పెద్దమ్మ తిడుతుంది కృష్ణ, వద్దని మురారి అంటాడు. కృష్ణ వినకుండా భవానిలాగా చీరకట్టుకొని రెడీ అవుతుంది. అలా రెడీ అయి మేడ మీద నుండి వస్తుంది. భవాని వెనుకాలే కృష్ణ నిల్చొని అచ్చం భవానిలాగే నటిస్తుంది. అలా‌ ఇద్దరు నడుచుకుంటూ మెట్ల మీద నుండి వస్తుంటే.. డైనింగ్ టేబుల్ మీద ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్ళంతా అలా ఆశ్చర్యంగా చూడటం గమనించిన భవాని.. వీళ్ళేంటి అలా చూస్తున్నారు.. ఏమైందని తనని తాను సరిచూసుకుంటుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. "అచ్చం పెద్దమ్మ లాగా భళే ఉన్నావ్ కృష్ణ" అని మధు అనగానే .. కృష్ణని భవాని చూస్తుంది. ఈ తింగరిపిల్లేంటి నాలాగే రెడీ అయింది.

ఏ మధు కుదురుగా ఉండలేవా అనేసరికి భవానికి నవ్వొస్తుంది. కానీ అందరి ముందు తక్కువ అవుతానని అనుకొని నవ్వు ఆపుకుంటుంది భవాని. ఆ తర్వాత రేవతి చూసి.. వేషాలు చాలు కానీ కూర్చొని తిను అంటుంది. ఏంటి రేవతి చిన్న, పెద్ద తేడాలేదా అని కృష్ణ అంటుంది. ఈ పిల్లేంటి నాలాగే మాట్లాడుతుందని భవాని తనలో తాను అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.