English | Telugu

రిషికి ఏంజిల్ ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటి.. శైలేంద్ర ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -852 లో.. జగతి, మహేంద్ర ఇంట్లో వాళ్లంత భోజనం చేస్తుంటారు. కూరలో ఉప్పు ఎక్కువ వేసావని ధరణిపై దేవయాని కోప్పడుతుంది. అక్కడే ఉన్న శైలేంద్ర గమినించి, ఫణింద్ర దృష్టిలో మంచివాడనిపించుకోవాలని కర్రీ బాగుంది మమ్మీ నువ్వు అలా అనకు.. ఈ కర్రీ నా కోసం చేసావా చాలా బాగుందని ధరణితో శైలేంద్ర చెప్తాడు. ధరణి ఆశ్చర్యంగా చూస్తుంది. సరదాగా ప్రేమగా మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటావేంటని శైలేంద్ర అంటాడు. మీకోసమే చేశానని ధరణి చెప్తుంది.

ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గురించి ముందు తెలుసుకుంటానని ఫణింద్రకి శైలేంద్ర చెప్తాడు. దానికి సరేనంటాడు ఫణింద్ర. మరొక వైపు ఏంటి ఏదో మాట్లాడాలని అన్నావని ఏంజిల్ ని వసుధార అడుగుతుంది. రిషి ఎందుకో డల్ గా ఉన్నాడు. నువ్వు రాసిన లెటర్ తనకి కన్పించేలా పెట్టాను చూసి ఉంటాడా ఎలాంటి రియాక్షన్ లేదని వసుధారతో ఏంజిల్ అంటుంది. ఆ లెటర్ చూడలేదు అనుకుంటా అని వసుధార అనగానే.. చూసాడు చూసేలా పెట్టానని ఏంజిల్ చెప్తుంది. అసలు రిషి ఇంతక ముందు ఎవరినైనా ప్రేమించాడేమో అని ఏంజిల్ అంటుంది. నిన్ను ఒకటి అడగాలా అని ఏంజిల్ వసుధారని అంటుంది. నువ్వు రిషిని ప్రేమించావా? లేక నిన్ను రిషి ప్రేమించాడా? ఇద్దరు ప్రేమించుకుంటున్నారా... మీ మధ్య ఏదైనా గతమేమైనా ఉందా అని ఏంజిల్ అడుగుతుంది. అదేం లేదు లెక్చరర్ కి లెక్చరర్ కి మధ్య ఏముంటుంది.. ఏం లేదని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని ఏంజిల్ రిలాక్స్ అవుతుంది. మరొక వైపు శైలేంద్ర కాలేజీలో మేనేజర్ తో మాట్లాడుతాడు. అది చూసిన జగతి, మహేంద్ర ఇద్దరు మేనేజర్ ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడని అనుకుంటారు. శైలేంద్ర దగ్గరికి జగతి మహేంద్ర ఇద్దరు వచ్చి.. ఏం తెలుసుకుంటున్నారని అడుగుతాడు. అప్పుడే ఫణింద్ర వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీరు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ విషయాలు తెలుసుకోమన్నారు కదా తెలుసుకుంటుంటే.. పిన్ని, బాబాయ్ ఇద్దరు వచ్చి ఏం అడుగుతున్నావని అంటున్నారని శైలేంద్ర చెప్తాడు. ఇది వరకు శైలేంద్ర అలా మాట్లాడాడు కానీ ఇప్పుడు నేర్చుకోనివ్వండని ఫణింద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా ఇదే టాపిక్ గురించి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు.

మరొక వైపు రిషిపై ఉన్న ప్రేమ వసుధార గురించి గుర్తు చేసుకుంటుంది. ఏంజిల్ ఎప్పుడు లేనివిధంగా అందంగా రెడీ అవుతుంది. అప్పుడే రిషి వస్తాడు. రిషి నీతో మాట్లాడాలి, నీకొక సర్ ప్రైజ్ ఉందని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.