English | Telugu

Guppedantha Manasu : జగతి కొడుకే మను.. క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1166 లో.. నా కన్నతల్లి ఎవరో చెప్పమని అనుపమని మను నీలదీస్తాడు. కానీ అనుపమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. నువ్వు ఇలా చెప్పావ్ అంటూ గన్ ని తన తల దగ్గర పెట్టుకొని.. ఇప్పుడు నిజం చెప్పమని అడుగుతాడు. మరొకవైపు జగతి రాసిన లెటర్ ని మహేంద్రకి ఇస్తాడు రిషి. ఆ లెటర్ చదువుతుంటాడు మహేంద్ర. జగతి ఎవరికి తెలియని కొన్ని నిజాలు అందులో చెప్తుంది.

రిషి, మహేంద్ర నన్ను క్షమించండి.. మీ దగ్గర ఒక నిజం దాచాను.. మనకి ఇద్దరు కవలలు పుట్టారు. ఒకరు రిషి.. ఇంకొకరు మను అని ఉంటుంది. నేను ఒకరిని అనుపమకి ఇచ్చాను. తను ప్రేమగా మనుని పెంచుకుంటుందని జగతి లెటర్ లో రాస్తుంది. మను మన కొడుకా అంటూ మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అనుపమ కూడా మనుకి నిజం చెప్తుంది. నువ్వు జగతి కొడుకువు.. నాకు ఇచ్చిన మాట కోసమే ఇలా చేసింది.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు.. అందుకే జగతి తన బిడ్డని ఇస్తానని అంది.. అందుకే నిన్ను ఇచ్చిందంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర ఇంకా లెటర్ చదువుతుంటాడు. శైలేంద్ర చేసిన తప్పులు గురించి చెప్తాడు. దీనంతటికి కారణం శైలేంద్ర, దేవయాని అని జగతి లెటర్ లో.. వాళ్లు చేసిన పనులు గురించి రాస్తుంది. అది చదివిన మహేంద్ర కోపంగా ఇంత చేసిన వీడిని ఎందుకు ఏమనట్లేదని రిషిని‌ మహేంద్ర అడుగుతాడు. ఆ రోజు త్వరలోనే ఉందని రిషి అంటాడు. ఈ లెటర్ చదివి.. నా వల్లే నీకు అన్యాయం చేసారని చాలా బాధపడ్డానని రిషి అంటాడు. నన్ను పెంచిన నా పెద్దమ్మ అలా చెయ్యడమేంటని రిషి బాధపడతాడు.

మరొకవైపు దేవయాని దగ్గరికి శైలేంద్ర వచ్చి.. వాడు రంగా కాదు రిషి అని అంటాడు. దాంతో దేవయానికి ఒక్కసారిగా చెమటలు పడుతాయి. రిషి మనల్ని వదలడని దేవయాని భయపడుతుంది. ఇక ఎవర్ని వదలనంటూ శైలేంద్ర ఆవేశపడుతాడు. మరొకవైపు రిషి, వసుధారలని గది లోపల ఉంచి బయటనుండి గడియపెడతాడు మహేంద్ర. శైలేంద్రని చంపుతానంటూ వెళ్తాడు. రిషి వసుధారలు పిలిచినా పట్టించుకోకుండా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.