English | Telugu

Guppedantha Manasu:రిషిని కిడ్నాప్ చేసింది శైలేంద్రేనని తెలుసుకున్న అనుపమ !

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -946 లో.. ధరణి వచ్చి శైలేంద్ర చేసిన కుట్రల గురించి వసుధార, మహేంద్రలకి చెప్తుంది. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి వసుధార వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతుంది. ఇలా కాదు బెగ్గింగ్ చెయ్యాలి, అప్పుడు చెప్తాను రిషి ఎక్కడ ఉన్నాడో అని వసుధారతో శైలేంద్ర క్రూరంగా మాట్లాడుతాడు. అయిన రిషి కోసం వసుధార తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని శైలేంద్రని రిక్వెస్ట్ చేస్తుంది. ఎంత రిక్వెస్ట్ చేసిన శైలేంద్ర తన విలనిజాన్ని చూపిస్తూ రిషి గురించి చెప్పడు.

ఆ తర్వాత రిషి క్షేమంగా ఇంటికి రావాలంటే.. నువ్వు ఎండీ సీట్ నాకు ఇవ్వాలని శైలేంద్ర అంటాడు. అది కుదరదని వసుధార చెప్తుంది. అయినా శైలేంద్ర కోపంగా.. నువ్వు నాకు ఎండీ చైర్ ఇస్తేనే రిషి ఇంటికి వస్తాడని చెప్తాడు. ఆ తర్వాత రిషి నీకు క్షేమంగా ఇంటికి రావాలా? ఎండీ చైర్ కావాలా? బాగా అలోచించి చెప్పమని వసుధారతో శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార ఏం చెయ్యలేక అక్కడ నుండి ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి డల్ గా రావడం చుసిన మహేంద్ర.. ఏమైంది అలా ఉన్నావని అడుగుతాడు. నేను ఎండీగా ఉండలేను మామయ్య. నాకు రిషి సర్ కావాలని వసుధార అనగానే.. అక్కడే ఉన్న అనుపమ, మహేంద్ర ఇద్దరు అసలు ఏమైందని అంటారు. ఇక వసుధార జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తుంది.

ఆ తర్వాత రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేసాడా అంటూ మహేంద్ర కోపంగా ఉంటాడు. మరొకవైపు ధరణిని శైలేంద్ర పిలిచి.. నీకు వసుధార ఎక్కడ కలిసింది. తనకి నిజం చెప్పావా అని శైలేంద్ర అడుగుతాడు. అప్పుడు ధరణి నేనేం చెప్పలేదంటూ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. అప్పుడే దేవయాని వస్తుంది. ధరణి వెళ్ళిపోతుంది. రిషి నీ దగ్గరే ఉన్నాడా అని దేవయాని అడుగుతుంది. నేనే కిడ్నాప్ చేయించానని శైలేంద్ర చెప్పి.. వసుధారతో చెప్పిన మాటలు కూడా చెప్తాడు. మరొకవైపు రిషి గురించి వసుధార బాధపడుతుంటే అనుపమ వచ్చి.. వసుధారకి ధైర్యం చెప్తుంది. మీ ఇద్దరిని ఎలాగైనా నేను ఒకటి చేస్తానని అనుపమ అంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..


Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.