English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి చేసిన మోసాన్ని తల్చుకొని ఏడ్చేసిన కొడుకు.. భార్యతో కొత్త ప్రయాణం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -292 లో..... శ్రీలత చేసిన మోసాన్ని సీతాకాంత్ గుర్తుచేసుకుంటూ బాధపడతాడు. అంత నమ్మిన తల్లి అతన్ని మోసం చేసిందన్న జాలి చూపించడం భరించలేకపోతున్నాను రామలక్ష్మి అని సీతాకాంత్ బాధపడుతాడు. మీరేం బాధ పడకండి అని రామలక్ష్మి ధైర్యం చెప్తుంది. తన ఒళ్ళో తల పెట్టి పడుకుంటాడు. ఇక నీ చెయ్యి ఎప్పుడు వదలను రామలక్ష్మి అని సీతాకాంత్ అంటాడు.

మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంట్లో కన్పించక పోయేసరికి సుజాత మాణిక్యం దగ్గరికి వచ్చి నిద్ర లేపుతుంది. వాళ్లు ఇంట్లో ఎక్కడ లేరనగానే అల్లుడు గారు తన తల్లి చేసిన మోసాన్నీ తట్టుకోలేక మన ముందు ఉండలేక వెళ్లిపోయి ఉంటాడు. అయిన తన వెంట రామలక్ష్మి ఉంది కదా ఎందుకు భయమని మాణిక్యం రిలాక్స్ గా ఉంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు నడుస్తూ వెళ్తారు. మన జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నాం. పాత విషయాలు పట్టించుకోకుండా మనసులో ఉంచుకోకుండా హ్యాపీగా ఉండాలని రామలక్ష్మి అంటుంది. అటుగా వాళ్లు వెళ్తుంటే.. దారిలో ఒకతను టీ షర్ట్స్ అమ్ముతుంటాడు. తనకి గిరాకీ అవ్వదు.. నేను అమ్మేలా చేస్తాను అనడంతో అలా చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఇస్తానని అతను అంటాడు. దాంతో సీతాకాంత్ తన బిజినెస్ మైండ్ తో అవి అమ్ముడు పోయేలా ఆఫర్ పెడతాడు. దాంతో పాటు రామలక్ష్మి కస్టమర్స్ ని పిలుస్తూ ఉంటుంది. దాంతో టీ షర్ట్స్ అమ్ముడుపోతాయి.

అతను ఫిఫ్టీ పర్సెంట్ లాభాన్ని సీతాకాంత్, రామలక్ష్మిలకి ఇస్తాడు. ప్రస్తుతం మనం బ్రతకడానికి డబ్బు వచ్చిందని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పుల వాళ్లు వచ్చి సందీప్ ని ఏమైనా అంటారేమో అని సందీప్ భయపడుతాడు. ఆ రామలక్ష్మి ని ఎదరుకునే కరెక్ట్ పర్సన్ ని తీసుకొని రావాలని ధన, శ్రీలత వాళ్ళు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే భద్రం ఒక దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తను అందరిని మోసం చేసి ల్యాండ్ అమ్ముతాడు. వాళ్లు తిరగబడితే అతన్ని చంపుతానంటూ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.