English | Telugu

Karthika Deepam2 : కార్తీక్, దీపల కొత్త బిజినెస్.. జ్యోత్స్నలో మొదలైన కుళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -241 లో.... దీప టిఫిన్ సెంటర్ పెడుతుంది. పూజ చేస్తుంది. దానికి అందరు వస్తారు. టిఫిన్ సెంటర్ ఎవరి పేరునోనని చెప్పకుండా సర్ ప్రైజ్ అంటుంది. తీరా చూస్తే కార్తీక్ పేరు ఉంటుంది. అది చూసి మా అక్కకి బావ అంటే ఎంత ఇష్టమో టిఫిన్ సెంటర్ పేరు కూడా బావ పేరు పెట్టిందని కాశీ అంటాడు. కార్తీక్ ఉంటే బాగుండు వాడికి ఇష్టం లేకుండా ఇది చేస్తున్నామని అనుకుంటుండగా అప్పుడే కార్తీక్ మాస్ లుక్ లో ఎంట్రీ ఇస్తాడు. భుజాన వాటర్ టిన్ తో, లుంగీలో ఎంట్రీ ఇస్తాడు కార్తీక్ .

ఆ తర్వాత కార్తీక్ వాటర్ టిన్ తీసుకొని వస్తుంటే.‌ అది చూసి అందరు షాక్ అవుతారు. మీరు వచ్చినందుకు చాలా థాంక్స్ అని దీప అనగానే.‌. టిఫిన్ సెంటర్ నా పేరు నా పెట్టినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటానని కార్తీక్ అంటాడు. అమ్మ నువ్వు మొదట బోణి చెయ్ అంటూ తనకి కార్తీక్ ముందుగా టిఫిన్ ఇస్తాడు. ఆ తర్వాత అందరికి టిఫిన్ ఇస్తాడు‌. అందరూ బాగుందని అంటారు. అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామంటూ కాశీ ఫోటో తీస్తాడు.

మరొకవైపు జ్యోత్స్న డిజైన్స్ వేస్తుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పగానే పారిజాతం చూస్తుంది. కాశీ గాడు ఫోటో పంపాడని కార్తీక్, దీప లతో టిఫిన్ సెంటర్ దగ్గరున్న ఫోటోని పంపిస్తాడు. అది చూసి జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అక్కడికి టిఫిన్ చెయ్యడానికి వెళదామంటూ పారిజాతాన్ని తీసుకొని వెళ్తుంది. ఇక జ్యోత్స్న ఎప్పటిలాగే కార్తీక్ ని ఆ స్టైల్ లో చూసి రెస్టారెంట్ ఓనర్ ని టిఫిన్ సెంటర్ ఓనర్ లాగా చేసావ్ కదనే అని దీపను తిడుతుంది. పారిజాతం ఫోటో తీసుకుంటుంటే.. ఇంకా బాగా తీసుకోమంటూ కార్తీక్ స్టిల్స్ ఇస్తుంటాడు. ఏదో చేస్తానని వచ్చావ్ కదా అని జ్యోత్స్నతో పారిజాతం అనగానే.. బావ చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడో.. ఏం చెయ్యాలి ఇక అంటూ జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.