English | Telugu

పెళ్లి కూతురికి ప్రదీప్ బిస్కెట్... కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్!

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి శ్రీదేవి, జయప్రద, బాబుమోహన్ జడ్జెస్ గా ఉన్నారు. ఐతే ఈ వారం జడ్జెస్ విషయంలో ప్రదీప్ కి శ్రీదేవికి మధ్య చిన్న డిస్కషన్ సీరియస్ గా మొదలయ్యింది. చివరికి కూల్ ఐపోయింది. "ఇందాకటి నుంచి వీళ్ళే జడ్జెస్ వీళ్ళే జడ్జెస్ అని నన్ను ఫోర్స్ చేస్తున్నారు" అని ప్రదీప్ అనేసరికి "అంటే మీరు డిసైడ్ ఇపోయారా వాళ్ళే జడ్జెస్ మేము పార్టిసిపెంట్స్ అని" శ్రీదేవి అనేసరికి " దేవతలు కూడా అనుకున్నారు" అని ప్రదీప్ బిస్కెట్ వేసాడు. ఇక శ్రీదేవి ఐస్ ఐపోయింది. దాంతో జయప్రద ముఖం మాడిపోయింది. "అయ్యో మేడం మీరు అలిగారా..యాక్చువల్లీ నేను మేడం కోసం రోజా పువ్వు తెద్దామనుకున్నా..కానీ మేడమే రోజా పువ్వులా ఉంటే ఇంకా రోజా ఎందుకని తేలేదు" అని అనేసరికి జయప్రద నవ్వేశారు.

"ఇదిగో నీకోసం అంటూ శ్రీదేవి ప్రదీప్ కి బిస్కెట్ ఇచ్చింది..ఎవరికీ లేదు నాకే " అని దాచుకున్నాడు ప్రదీప్.. "దాచిపెట్టావంటే కచ్చితంగా పెళ్లి కూతురు కోసమే" అంటూ పంచ్ వేశారు బాబూమోహన్. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో రవి, సుష్మ కిరణ్ చిన్నారులతో కలిసి చేసిన స్కిట్ కి బాబుమోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నాకు మా అమ్మ గుర్తొచ్చింది. 3 వ తరగతిలో మా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లెలు ఉంది. ఆమెకు చిన్నప్పటి నుంచి తల దువ్వి, జడ వేసేవాడిని..మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు. మేము మా బాధను ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు" అని చెప్తుండగా ఈ ప్రోమో ఎండ్ అయ్యింది. డ్రామా జూనియర్స్ లో ప్రతీ వారం చిన్నపిల్లలు చేసే స్కిట్స్ మంచి హైలైట్ గా నిలుస్తున్నాయి. వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా అలరిస్తున్నాయి. జడ్జెస్ కూడా ఈ చిన్నారుల స్కిట్స్ ని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు బుల్లితెర నటీనటులు కూడా వచ్చి స్కిట్స్ వేయడం ఇంకా మంచి విషయం.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.