English | Telugu

మండిపోతున్న ఎండలకు కారణం ప్రతిపక్షాలు


డ్రామా జూనియర్స్ సీజన్ 6 గత వారం లాంచింగ్ ఎపిసోడ్ 1 అయ్యాకా ఈ వారం లాంచింగ్ ఎపిసోడ్ 2 ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. డ్రామా జూనియర్స్ రోల్ నంబర్ 10 లో రాజమండ్రి నుంచి 11 ఏళ్ళ వయసున్న కుర్రాడు లోకేష్ వచ్చి అందరినీ అద్భుతంగా కడుపుబ్బా నవ్వించాడు. "సుత్తి ఛానల్ విత్ కత్తి" అనే లోగోతో న్యూస్ రీడర్ గా ఎన్నో పాత్రలు పోషించి ఒక వెరైటీ స్కిట్ ని పెర్ఫార్మ్ చేసాడు. తన స్కిట్ లో అన్ని రోల్స్ తానే పెర్ఫార్మ్ చేసేసాడు. బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ చదువుతూ మంచి ఫన్ క్రియేట్ చేసాడు. " రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ..తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోలేక తికమక పడుతున్న బిచ్చగాళ్ళు" అనేసరికి జడ్జెస్ అంతా నవ్వేశారు.

అసలే రాష్ట్రంలో ఎండ వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా ఎక్కువగా ఉంది. ఇలాంటి టైములో లోకేష్ చదివిన రాజకీయ వార్తలు మంచి ఫన్నీగా ఉన్నాయి. "ప్రియమైన ప్రజలారా మీకు తెలుసు నాకు ఇష్టమైనది చేపల పులుసు ..ప్రజలారా ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే టిఫన్ లోకి రెండో సారి చట్నీ అడగలేని దుస్థితిలో ఉన్నాం ...ఇదంతా ఎవరి వల్ల...ప్రతిపక్షాల వల్ల" "ఈ రోజు ఎండలు ఇంతగా మండిపోతున్నాయి అంటే కారణం ఎవరు...ప్రతిపక్షాలు " "అదే నన్ను గెలిపిస్తే ఎండాకాలంలో ఎండని, వర్షాకాలంలో వర్షాన్ని, చలికాలంలో చలిని టైంకి తీసుకొస్తానని మీ అందరి మీద ప్రమాణం చేస్తున్నాను" అంటూ ఒక రేంజ్ డైలాగ్ చెప్పేసరికి ప్రదీప్ మొహం వెరైటీగా ఐపోయింది. ఇక వాతారణం వార్తలు, మధ్యలో యాడ్స్ అన్ని వెర్షన్స్ లో సింగల్ హ్యాండ్ తో స్కిట్ ని పెర్ఫార్మ్ చేసి అందరినీ నవ్వించేసాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.