English | Telugu

భార్య ఆరోగ్యంపై బిగ్ బాస్ కౌశల్ ఎమోష‌న‌ల్‌ పోస్ట్.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. రెండో సీజన్ విన్నర్ గా కంటే పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచేవాడు. పీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని, గిన్నిస్ రికార్డ్ కోసం అడిగారని ఇలా గొప్పలు చెప్పుకోవడంతో అతడి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇది కాకుండా.. కౌశల్ ఆర్మీలో కొందరు సభ్యులు అతడికి వ్యతిరేకంగా మారడంతో వ్యవహారం బాగా ముదిరిపోయింది.

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులు వృధా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. చెప్పినట్లుగా కౌశల్ డబ్బులను ఫౌండేషన్ కు ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వార్తలతో అతడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవాడు. కౌశల్ తో పాటు అతడి భార్య నీలిమపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. మొన్నామధ్య నీలిమ ఆరోగ్యం గురించి కౌశల్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తన భార్యకు ఆరోగ్యం బాలేదని మీడియా ముందు చెప్పాడు కౌశల్.

నీలిమకు గతంలో ఓ సర్జరీ కూడా జరిగింది. అయితే తాజాగా కౌశల్ తన భార్యను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''ఏదో సాధించేందుకు వెళ్లావ్.. దాని కోసం నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో నువ్ అనుకున్నది సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకొని రా.. నువ్ కన్న కలల కోసం పోరాడు.. లవ్యూ.. మిస్ యూ'' అంటూ కౌశల్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన కౌశల్ అభిమానులు.. వదినకు ఏమైందంటూ కౌశల్ ని ప్రశ్నిస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.