English | Telugu

ఝాన్సీ మేక‌ప్‌మేన్ ఎంత మంచివాడంటే...

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉపాధిని కోల్పోయి.. తినడానికి తిండి లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు.

ఇందులో భాగంగా యాంకర్ ఝాన్సీ తనకు వీలైనంతలో కొంతమందికి నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ఈ మేరకు తన టీమ్ తో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన మేకప్‌మేన్‌, టచప్ అసిస్టెంట్ రమణ చేస్తోన్న మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు. వారికోసం ఇచ్చిన డబ్బులను కూడా ఇతరుల కోసమే వాడుతున్నారని ఝాన్సీ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

''నాకు వీలైనంతలో ఒక పాతిక మందికి నెల సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అది నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినా కూడా అతడు తనకు ఇబ్బంది లేదని చెప్పి అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసర సరుకులు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు.. మా శ్రీను, రమణ జన్మతః గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు. వీరితో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.