English | Telugu

బిగ్‌బాస్ షో కోసం జెస్సీ డ‌బ్బులిచ్చాడా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 తెలుగు ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే వుంది. తాజాగా మ‌రో ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ షోలోకి ఎంపిక‌య్యే కంటెస్టెంట్‌ల నుంచి నిర్వాహ‌కులు డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని, వారిచ్చే డ‌బ్బుల ఆధారంగానే కంటెస్టెంట్‌ల‌ని నిర్వాహ‌కులు ఎంపిక చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఓ కార‌ణం కూడా వుంది. బిగ్‌బాస్ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టీన‌టులు, క‌మెడియ‌న్‌లు, సింగ‌ర్‌లు, డ్యాన్స్ మాస్ట‌ర్‌లు, ట్రాన్స్ జెండ‌ర్‌లు మాత్ర‌మే కంటెస్టెంట్‌లుగా ఎంపిక‌య్యారు.

కానీ మొట్ట‌మొద‌టి సారి సీజ‌న్ 5 కోసం ఓ మోడ‌ల్‌ని ఎంపిక చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అత‌ని నుంచి నిర్వాహ‌కులు డ‌బ్బులు తీసుకునే ఎంపిక చేశారంటూ తాజాగా ప్ర‌చారం మొద‌లైంది. ఇదంతా అనారోగ్య కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్ జెస్సీ గురించే. అయితే తాజాఆ విమ‌ర్శ‌ల‌పై జెస్సీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌ను డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని, డ‌బ్బులిచ్చి తాను హౌస్లోకి వ‌చ్చాన‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని ఈ సంద‌ర్భంగా జెస్సీ క్లారిటీ ఇచ్చాడు.

ప్రేక్ష‌కులే కాకుండా హౌస్‌లో వున్న వాళ్లు కూడా నేను డ‌బ్బులిచ్చే హౌస్‌లోకి వచ్చాన‌ని విమ‌ర్శ‌లు చేశార‌ని, కానీ నేను బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు డ‌బ్బులివ్వ‌డం ఏంట‌ని ఎదురు ప్ర‌శ్నిస్తున్నాడు. నా ఎకౌంట్‌లో కేవ‌లం రూ. 11 వేలు మాత్ర‌మే వున్నాయ‌ని, నా ఆర్థిక స్టోమ‌త అంతంత మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌కు తండ్రి లేడ‌ని, రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డ‌బ్బుతో మోడ‌లింగ్ లోకి వెళ్లాన‌ని .. తన టాలెంట్‌ని గుర్తించే బిగ్‌బాస్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని, త‌ను మాత్రం అంతా అంటున్న‌ట్టుగా ఎలాంటి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని స్పష్టం చేశాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.