English | Telugu

ఆవకాయ్ పచ్చడితో గోరు ముద్దలు తినిపించిన గంగవ్వ

"ఢీ సీజన్ 16 " గ్రాండ్ గా బుధవారం లాంఛ్ కాబోతోంది. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తూ ఉంటామో ఇప్పుడు బుల్లితెర మీద డీపీఎల్ కూడా అలాగే చూడబోతున్నాం. ఢీ న్యూ సీజన్ కి ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు. అదే డిపిఎల్ దీని ప్రోమో చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ ఇందులో కనిపించారు. ప్రదీప్, ఆది, దీపికా పిల్లి, శేఖర్ మాష్టర్, పూర్ణ, గంగవ్వ, విజె సన్నీ కనిపించారు. ఈ లాంఛింగ్ ఎపిసోడ్ కి వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చారు. అభి మాష్టర్ టీంకి బెజవాడ టైగర్స్ అని, గ్రీష్మ మాష్టర్ టీంకి హైదరాబాద్ ఉస్తాద్స్ అని, ఐశ్వర్య మాష్టర్ టీంకి నెల్లూరు నెరజాణలు, కన్నా మాష్టర్ టీంకి ఓరుగల్లు వీరులు అనే టైటిల్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

హైపర్ ఆది, విజె సన్నీ వచ్చి పెళ్లి చేసుకోవచ్చా లేదా ? కొన్ని టిప్స్ చెప్పండి అని వరుణ్ సందేశ్ ని అడిగారు "పెళ్లి చేసుకోండి..అదిరిపోతోంది" అని చెప్పాడు..."చెప్తుంటేనే చెమటలు పడుతున్నాయి" అని కౌంటర్ వేసాడు ఆది. "మాష్టర్ పెళ్లి చేసుకోవాలా వద్దా"అని సన్నీ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి "ఆయనకు పెళ్లి చేసుకున్నా పెద్దగా బాధేమీ లేదు..ఆయన ఇంటి ఫుడ్డు, హోటల్ ఫుడ్డు రెండు బానే తింటాడు" అని ఆన్సర్ చేసాడు ఆది. ఇంతలో గంగవ్వ ఆవకాయ అన్నం తీసుకుని స్టేజి మీదకు వచ్చింది.."ఆది తెలుసా నీకు.." అని ప్రదీప్ అడిగాడు.."ఆది తెలుసు...పంచులు వేస్తాడు బాగా..కానీ నాకు సరిగా వినిపించవు" అని చెప్పింది. ఇక గిన్నెలోంచి ఆవకాయ అన్నం మొత్తాన్ని గోరు ముద్దలు చేసి స్టేజి మీద ఉన్న అందరికీ తినిపించింది. "మాకు ఆకలేస్తుంది గంగవ్వా అని చెప్పి శేఖర్ మాష్టర్ కూడా తిన్నారు. చాలా రోజుల తర్వాత ఆవకాయ అన్నం తిన్నాం నీ చేత్తో...మా అమ్మ పెట్టినట్టే ఉంది" అంటూ గంగవ్వ కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.