English | Telugu

చిరంజీవితో మురళి బాబాయ్.. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీపై పోలీస్ కేసు!


ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో పెర్ఫార్మెన్స్ ఒక్కో లెవెల్ లో ఉంది. ముందుగా శ్రీవాణి తన కూతురు నందినితో వచ్చి డాన్స్ చేసింది. "రాను రానంటూనే" సాంగ్ కి శ్రీవాణి కూడా డాన్స్ చేసింది. ఇక ఆది ఐతే "ఏదేమైనా శ్రీవాణి గారి కుర్రతనం పోలా" అంటూ కామెంట్ చేసాడు. తర్వాత జతిన్ వచ్చి "నాయిరే నాయిరే" సాంగ్ కి డాన్స్ చేసాడు. అన్షు రెడ్డి "గోంగూర తోటకాడ" సాంగ్ కి డాన్స్ చేసింది. ఇక ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అభి తీసుకొచ్చిన మురళి బాబాయ్. చిరంజీవి సాంగ్స్ కి డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ ఐన మురళి బాబాయ్ కి ఒక షోలో నాగబాబు ప్రామిస్ చేశారు..చిరంజీవిగారితో మాట్లాడించి, ఒక కప్పు కాఫీ తాగేలా ఒక ఫోటో తీసుకునే అవకాశం కల్పిస్తాను అన్నారు. ఆ బాధ్యతను ఆదికి అప్పగించారు. ఇప్పుడు స్టేజి మీదకు మురళి బాబాయ్ వచ్చారు. అన్నట్టుగానే చిరంజీవి, అనిల్ రావిపూడి, మురళి బాబాయ్, ఆది అంతా కలిశారు. ఇక మురళి బాబాయ్ కూడా మాట్లాడాడు. "నేను ఇంత తొందరగా సర్ ని కలుస్తానని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. సర్ తో చెప్పాను చనిపోతే చాలు ఇంకా అని" అన్నాడు.

ఇక ఆది మాట్లాడుతూ "అతను ఎంత మాట్లాడాడు అంటే చివరిగా చిరంజీవి గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన ఒక మూవ్మెంట్ వేస్తావు" అని మాట ఇచ్చారు. తర్వాత మణికంఠ మాష్టర్ వచ్చి "నువ్వు పెద్ద పులి లెక్క" సాంగ్ కి పెర్ఫార్మ్ చేసాడు. ఇక మణికంఠతో కలిసి హోస్ట్ నందు కూడా డాన్స్ ఇరగదీసాడు. "మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు కానీ ఇరగదీసారు" అంటూ నందుకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు జడ్జి విజయ్ బిన్నీ మాష్టర్.. ఇక పల్సర్ బైక్ ఝాన్సీ వచ్చి ఒక మాస్ సాంగ్ కి చేసిన డాన్స్ కి అందరికీ పూనకాలు వచ్చేసాయి. తర్వాత పండు, ఆది కూడా వెళ్లి ఆ మాస్ స్టెప్స్ వేశారు. ఇక ఆది ఫన్నీగా కొన్ని మాటలు చెప్పాడు. "మా గంగారాం తిరునాళ్ళకు విచ్చేసిన ఎంఎల్ఏ రెజీనా కాసాండ్రా గారికి, మా మంత్రి విజయ్ బిన్నీ గారికి ఒక సారి చప్పట్లు" అన్నాడు. తర్వాత విజయ్ బిన్నీ మాష్టర్ మిగతా డాన్సర్స్ అంతా వచ్చి డాన్స్ చేశారు. "మన మంత్రి విజయ్ బిన్నీ గారి అమ్మాయిలతో డాన్స్ వేయడం వేయడం వలన ఒక చిన్న పోలీస్ కేసు అయ్యింది." అంటూ వార్తలు చెప్పాడు ఆది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.