English | Telugu

బొమ్మలు హలీం అమ్మి చదువుకున్నాడు!

సరిగమప సింగింగ్ సూపర్ స్టార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న షో. ఇందులో ఈ వారం ముందుగా పార్వతి "కిటకిట తలుపులు" సాంగ్ పాడి ఫినాలే కి గోల్డెన్ టికెట్ అందుకుంది. తర్వాత డేనియల్ రాజు "నీ మనసే" అనే సాంగ్ పాడి స్టేజిని హుషారెత్తించాడు. డేనియల్ రాజు సాంగ్ ని ఈ షోకి వచ్చిన నవదీప్ కూడా స్టేజి ఎక్కి డేనియల్ తో కలిసి పాటందుకుని అందరినీ మెప్పించాడు. నా పాటకు ఎన్ని మార్కులు ఇస్తారంటూ కోటి గారిని కాసేపు ఆట పట్టించాడు. చాలా బాగా పడ్డావ్ అంటూ కోటి గారు మెచ్చుకుంటారు.

ఇక ఇదే స్టేజి మీదకు డేనియల్ రాజు ఫ్రెండ్ మూర్తిని స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. ఇక అతను డేనియల్ రాజు గురించి తాను లైఫ్ లో పడిన కష్టాలు గురించి చెప్పి అందరినీ కంట తడి పెట్టించాడు. డేనియల్ రాజు చాలా అంటే చాలా పేదరికం నుంచి తిండి కూడా సరిగా లేని పరిస్థితి నుంచి ఎదిగిన వ్యక్తిగా తన గురించి తెలియని ఎంతో మందికి చెప్పాడు. తాను చదువుకోవడానికి డబ్బులు కూడా లేనప్పుడు రెస్టారెంట్ లో పని చేసి వచ్చిన డబ్బులతో తాను చదువుకోవడమే కాదు తనను కూడా చదివించాడని చెప్పుకొచ్చారు మూర్తి. రంజాన్ టైంలో హలీం అమ్మడమే కాదు బొమ్మలు కూడా అమ్మి తన కోసం ఎంతో చేసాడని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు పాటలు ఎంతో ఇష్టమని అందరిని తనంటే చాలా ఇష్టం అని చెప్పాడు.

ఇక ఒకానొక టైంలో తనకు తన చెల్లెలికి కష్టం వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు మూర్తి మాత్రమే వచ్చి చెయ్యి ఇచ్చి ఆదుకున్నాడు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు డేనియల్. అందరి జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవని ఇలాంటి ఘటనలు చదివేటప్పుడు, వినేటప్పుడు అనిపిస్తుంది. ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.