English | Telugu

కళాపోషణకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు!


శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మస్త్ కామెడీని పండించింది. చిన్నప్పుడు చెంబు పట్టుకుని తప్పిపోయిన కొడుకును, కూతురిని వెతుక్కుంటూ కృష్ణ భగవాన్ ఈ షోకి జడ్జిగా వస్తాడు. అతని పనోడి క్యారెక్టర్ లో బాబా భాస్కర్ నటించాడు. కొడుకుల్ని కనిపెట్టాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిస్తే చాలు అంటాడు భాస్కర్. నా పిల్లలు దొరికితే నా ఆస్తి యావత్తు ఇచ్చేస్తాను అని చెప్తాడు కృష్ణ భగవాన్ అలా చెప్పేసరికి యావత్తు అంటే బి.పి ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లా అని అడుగుతాడు. ఆ డైలాగ్ కి కృష్ణ భగవాన్ మళ్ళీ వేసావా పంచి అని అంటాడు .

అంటే ఇంతకుముందు పద్మకి వర్షకి ఆస్తి కొంత ఇచ్చేసా కదా ఇప్పుడు నా పిల్లలు వస్తే మిగతాది ఇచ్చేద్దామని అనేసరికి పద్మకి వర్షకి ఎం ఇచ్చారు అంటాడు భాస్కర్. ఆస్తిలే గాని కాస్త కళాపోషణ ఉండాలి అంటాడు భాస్కర్ తో. ఈ వయసులో కళాపోషణ ఏంటండీ నవ్వుతారు ఊరుకోండి అంటాడు. కళాపోషణకి ఎక్సపైరీ డేట్ లేదు అనేసరికి అందరూ నవ్వేస్తారు. పిల్లలు ఎలా వెళ్లిపోయారు చెప్పండి అని భాస్కర్ అడుగుతాడు. చెంబు తీసుకుని కొడుకు వెళ్ళిపోయాడు తన చెంబు వెతుక్కుంటూ కూతురు కూడా వెళ్లిపోయిందని చెప్పేసరికి భాస్కర్ షాక్ అవుతాడు.

తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజని, రష్మిని పిలిపించి తన పిల్లలని వెతికే పని అప్పజెబుతాడు కృష్ణ భగవాన్. ఇలా ఈ వారం పంచ్ డైలాగ్స్ తో ఈ షో నడిచింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.