English | Telugu

సెలబ్రిటీస్ హోమ్ టూర్స్...ఆదిని చెడుగుడు ఆడేసుకున్న చిన్నారి!

ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోమ్ టూర్స్ సెగ్మెంట్ మంచి ఫన్నీగా ఉంది. ముందుగా జడ్జి ఇంద్రజ హోమ్ టూర్ తో స్టార్ట్ అయ్యింది. ఇంద్రజ ఒక పూరి గుడిసె ముందు నిలబడి ఫోజ్ ఇచ్చింది.

ఆ ఫోటో చూసి ఇంద్రజ షాకైపోయింది. ఇక ఆది ఇంద్రజ ఆ గుడిసెలో ఎందుకు ఉందో చెప్పాడు. "అంటే ఆవిడకు ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు ఇచ్చేసి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు." అని చెప్పాడు. తర్వాత రష్మీ ఇంటిని చూపించారు. రష్మీ రేకుల ఇంటి ముందు నిలబడి ఉంది. "ఇంద్రజ తనకు ఉన్నదంతా దానం చేసి పూరింట్లో ఉంటోంది. రష్మీ మాత్రం ఉన్నదాన్ని రెంట్లకు ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్డులో ఉంటోంది." అని చెప్పాడు ఆది. తర్వాత ఆది హోమ్ టూర్ పిక్ ని చూపించారు.

ఆది ఒక మురికివాడలో ఉన్నట్టుగా చూపించారు. ఆ పక్కనే ఆది పెద్ద కటౌట్ ని పెట్టారు. ఇక ఆది ఎలా ఆ ఇళ్ల మధ్య నుంచి బయటి ప్రపంచంలోకి వస్తాడు అనే విషయాన్ని నాటీ నరేష్ ఎక్స్ప్లైన్ చేసాడు. "ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకు దూకుతాడు అట్లా అని వెనక ఇంటికి వెళ్తాడు. దొరికి పోగానే ఇలా ఫేస్ పెడతాడు." అనేసరికి ఆది నవ్వేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ లో కొంతమంది స్కూల్ పిల్లలు వచ్చి ట్రేండింగ్ సాంగ్ "బటర్ ఫ్లై, బటర్ ఫ్లై" కి డాన్స్ చేసి చూపించారు. ఐతే ఆ పాట వినిపించడానికి వెల్లడానికి ఆది ఫైర్ అయ్యేసరికి బయటికెళ్లి జోక్స్ వేసుకోండి, ముందు మీరు నాకు 9 వ ఎక్కం చెప్పండి , ఇదంతా కాదు గాని ఇంగ్లీష్ లో మాట్లాడు అంటూ ఒక చిన్నారి ఆదిని చెడుగుడు ఆడేసుకుంది. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.