English | Telugu

Brahmamudi: కన్నపేగు బంధమే.. దొంగ అంత పని చేశాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -260 లో.. కనకం నిద్రలో ఒక కల కంటుంది. అప్పు గదిలోకి కనకం వెళ్ళి చూసేసరికి అప్పు సుసైడ్ చేసుకున్నట్లు కల కంటుంది. దాంతో ఒక్కసారిగా‌ కనకం నిద్ర నుండి ఉలిక్కిపడి లేవగానే.. ఏంటి అని కృష్ణమూర్తి అడుగుతాడు. ఆ తర్వాత కనకం అప్పు గదిలోకి వెళ్తుంది. కనకం వెళ్లేసరికి అప్పు తన గదిలో ఉండదు. దాంతో కనకానికి ఇంకా టెన్షన్ అవుతుంది.

ఆ తర్వాత కనకం ఇంట్లో చుసి బయటకు వస్తుంది. అప్పు బయట బాధపడుతు ఉండడం చూసి.. ఇక్కడ ఎందుకు ఉన్నావని కనకం అడుగుతుంది. నాకు ఇక్కడ ఉండే స్వేచ్చ కూడా లేదా అని అప్పు అనగానే.. నీకు ఎప్పుడు స్వేచ్ఛ ఇచ్చాను. అబ్బాయిలతో ఫ్రెండ్ షిప్ చేసినా, వాళ్ళతో తిరిగినా, నీకు ఎప్పుడు అడ్డుచెప్పలేదని కనకం అనగానే.. అడ్డు చెప్పిన బాగుండేది. ఇప్పుడు నాకు ఈ సిచువేషన్ రాకపోయేదేమోనని అప్పు అంటుంది. ఆ తర్వాత అప్పుని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది కనకం. నేను నీ దగ్గర పడుకుంటానని కనకం చెప్తుంది. కావ్య ఉంటే నన్ను కష్టపెట్టేది కాదని అన్నాను కదా? నువ్వు బాధపడ్డావా అని కనకం అడుగుతుంది. లేదు అక్క అంటే నాకు ఇష్టం. ఎందుకు బాధపడుతానని అప్పు అంటుంది. కానీ నువ్వు నువ్వు నా పక్కన ఉంటే దైర్యంగా ఉంటుంది. ఒక కొడుకులాగా నన్ను ఎప్పుడు వదిలి వెళ్లొద్దని కనకం అనగానే.. అప్పు ఎమోషనల్ అయి కనకాన్ని హత్తుకొని ఏడుస్తుంది. మరొకవైపు రాజ్ కావ్య పడుకున్నాక వారి గదిలోకి దొంగ వస్తాడు. రాజ్ కావ్యల కాళ్ళు చేతులు కట్టివేస్తాడు ఆ దొంగ. ఆ తర్వాత ఇద్దరికి మెలుకువ వస్తుంది. వచ్చిన తర్వాత దొంగని చూసి ఇద్దరు బయపడతారు‌‌. దొంగ అన్నయ్య అంటూ కావ్య మాట్లాడేసరికి.. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా పిలువలేదు. నా దొంగ చెల్లి అంటూ ఆ దొంగ అంటాడు‌. కాసేపు కావ్య, ఆ దొంగ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత రాజ్ కావ్యల కట్లు విప్పకుండానే దొంగ వెళ్ళిపోతాడు.

మరొకవైపు పది లక్షలు ఎవరిని అడగాలి. అరుణ్ డబ్బులు తీసుకొని రమ్మని లొకేషన్ కూడా షేర్ చేసాడని స్వప్న టెన్షన్ పడుతుంది. నగలు తాకట్టు పెడతా ఇంట్లో వాళ్ళు నగలు ఎక్కడ అంటే రాహుల్ పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకీ ముందు నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తు రాహుల్ దొరికిపోయాడు కదా.. రాహుల్ తీసుకొని వెళ్ళిపోయాడని అబద్దం చెప్పొచ్చని స్వప్న అనుకుంటుంది. అదంతా రాహుల్ విని షాక్ అవుతాడు. తరువాయి భాగంలో అరుణ్ ని స్వప్న కలిసిన విషయం రాహుల్ ఇంట్లో అందరికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.