English | Telugu

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త విలన్ ఎంట్రీ!

తెలుగు టీవి సీరియల్స్ లలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. అందులో బ్రహ్మముడి సీరియల్ టాప్-5 లో ఉంటుంది.

ఈ సీరియల్ లోని ప్రతీ పాత్ర అందరికి సుపరిచితమే. ముఖ్యంగా కావ్య పాత్ర.. కావ్య అలియాస్ దీపిక రంగరాజు.. బ్రహ్మముడి సీరియల్ లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. రాజ్-కావ్యల జోడీ బుల్లితెరపై హిట్ జోడీగా నిలిచింది. ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా అనిపిస్తాయి. ఇక బ్రహ్మముడి తాజా ఎపిసోడ్ లలో భాగంగా ధాన్యలక్ష్మి ఆస్తిని పంచివ్వమని అడగడంతో ఇంటి పెద్ద సీతారామయ్యకి గుండెపోటు రావడంతో.. అతడిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించడం.. డాక్టర్స్ కోమాలోకి వెళ్ళాడని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇక రుద్రాణి వేసిన మాస్టర్ ప్లాన్ లో ధాన్యలక్ష్మి ప్రతీసారీ బలిపశువు అవుతుంది.

ఇక ధాన్యలక్ష్మి ఆస్తిని వాటాలు పంచి ఇవ్చమనడంతో సుభాష్ పంపిస్తాననడం హైలైట్ గా నిలిచింది. తీరా లాయర్ వచ్చి ఓ న్యూస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద పెద్దాయన ఎప్పుడో రాసిచ్చాడని లాయర్ చెప్పడంతో అందరు కంగుతిన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రాజ్ ఆఫీస్ లో ఉండగా కొంతమంది ఆఫీసర్స్ వచ్చి సీతారామయ్య ఒక కంపెనీకి షూరిటీ ఇచ్చాడని చెప్పడం.. దానికి ఒప్పుకోమని రాజ్ ని బలవంతం చేయడం ఉత్కంఠగా మారింది. అయితే ఆ షూరిటి ఇచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ కొడుకే మన కొత్త విలన్. అతనే నందగోపాల్. ఇక అతని ఎంట్రీ మాములుగా లేదు. 'ఈగ' సినిమాలో‌ని విలన్ 'కిచ్చ సుదీప్' లా అనిపిస్తోంది. ఇక అతని రాకతో బ్రహ్మముడి సీరియల్ మగ విలన్ దొరికేసాడనే ఫీలింగ్ వచ్చేసింది. ముందుముందు రాజ్ తో ఈ కొత్త విలన్ కి మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.