English | Telugu

శ్రీముఖి పెళ్లెప్పుడో తెలుసా ?


ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది హోస్ట్ శ్రీముఖి. ఇండస్ట్రీలో ఉన్న ఒక తెలుగింటి అమ్మాయికి పెళ్ళైతే చూసి హ్యాపీగా ఉండేవారిలో చాలా మంది ఉన్నారు. ఐతే తనకు పెళ్లి చేసేసుకోవాలని ఎక్కువ కోరికగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి త్వరలో జరగబోతోందన్న విషయాన్నీ కూడా చెప్పింది. ఎనర్జీ సేవింగ్ తో పాటు ఏజ్ సేవింగ్ కూడా చేస్తున్నారా ఎలా ? అని తేజస్విని మడివాడ అడిగేసరికి శ్రీముఖి ఇలా చెప్పింది

" రోజూ ఒక్క మీల్ మాత్రమే తింటాను. అది కూడా ఫుల్ ప్రోటీన్ మీల్. ఈ ప్రొఫెషన్ కోసం చాలా ఇష్టమైన ఫుడ్ ని సాక్రిఫైస్ చేశా. నేను పదో తరగతిలో ఉండేటప్పుడు 108 కేజీలు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా మారిపోయాయి పూర్తిగా ప్రొఫెషన్ కోసం. దేవుడు ఏదైనా ఇవ్వాలంటే కస్టాలు పెట్టి మరీ ఇస్తాడు. అలాగే నేను ఎంతో కష్టపడుతూనే ఉంటాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. నేను షోలో కనిపించే విధానం కానీ నేను వేరే వాళ్ళను ఇన్స్పైర్ చేసే విధానం అన్నిటిని ప్రేమిస్తాను. ఇక నాకు రాబోయే అబ్బాయి నన్ను బీటౌట్ చేసేలా ఉండాలి. నాతో పోటీ పడాలి. నేను ఒక విషయాన్నీ మార్చుకోవాలి అనుకుంటున్నా..నేను ఎప్పుడూ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాను. కానీ దాని వలన నాకు వేల్యూ లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. సో ఇవ్వడం అనేదాన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నా " అని చెప్పింది శ్రీముఖి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.