English | Telugu

Brahmamudi : బిడ్డ కోసం భర్తను వదలుకుంటానని చెప్పిన భార్య..రాజ్ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -842 లో..... కళ్యాణ్ ఇంటికి వచ్చి వదిన మీరు హాస్పిటల్ లో చూపించుకోలేదు కదా అంటాడు. నేను హాస్పిటల్ లో చూపించుకోలేదని నీకెలా తెలుసని కావ్య అడుగుతుంది. ఏదో క్యాజువల్ గా అన్నానని కళ్యాణ్ కవర్ చేస్తాడు. కళ్యాణ్ వెళ్ళిపోయాక.. కళ్యాణ్ ఇది వరకు మాట్లాడిన మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. అవి గమనించిన కావ్యకి కళ్యాణ్ కి అన్ని తెలిసి ఉంటాయని అనుకుంటుంది. దాంగో అతన్ని అడగాలని వెళ్తుంది.

కళ్యాణ్ దగ్గరికి కావ్య వస్తుంది. అసలేం జరుగుతుంది.. మీ అన్నయ్య ఎందుకు అబార్షన్ చేపిస్తానని అంటున్నాడని కావ్య అడుగగా కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. వెనకాల నుండి రాజ్ చూసి చెప్పొద్దని సైగ చేస్తాడు. దాంతో కళ్యాణ్ నాకు తెలియదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే రాజ్ వస్తాడు.. ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు.. అది కనుక్కుంటానని కావ్య అంటుంది.

మరొక వైపు సుభాష్ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉంది రమ్మని పిలుస్తాడు. మీ ఇంట్లో జరిగే విషయాలు ఎందుకు బయటకుపోతున్నాయి కావ్యకి రాజ్ అబార్షన్ చేయించాలనుకున్నాడు అంట కదా అని అతను అనగానే సుభాష్, అపర్ణ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపాడని కావ్య అందరికి చెప్తుంది. నా బిడ్డ కోసం మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడ సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.