English | Telugu

Brahmamudi : బ్రహ్మముడిలో సూపర్ ట్విస్ట్.. కూతురిని అపర్ణ గెంటేసిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -776 లో..... ఇందిరాదేవి కంగారు పడుతుంటే.. అసలు నా దగ్గర ఏం దాస్తున్నారని కావ్య అడుగుతుంది. అసలు ఈ రేవతి ఎవరు ఆవిడకి ఈ ఇంటికి సంబంధం ఏంటని కావ్య అడుగుతుంది. ఇందిరాదేవి చెప్పకపోవడంతో నేను అత్తయ్యని అడుగుతానంటూ కావ్య వెళ్ళబోతుంటే ఇందిరాదేవి ఆపుతుంది. రేవతి ఈ ఇంట్లో మనిషి అని ఇందిరాదేవి అంటుంది అంటుంది. మరి ఏం తప్పు చేసిందని అక్కడ ఉంటుందని కావ్య అంటుంది.

అది చేసింది తప్పు కాదు.. పొరపాటు. రేవతి ఎవరో కాదు అపర్ణ కన్నబిడ్డ అని ఇందిరాదేవి చెప్పగానే కావ్య షాక్ అవుతుంది. ఇందిరాదేవి అసలు ఏం జరిగిందో కావ్యకి చెప్తుంది. రేవతి , రాజ్ ఇద్దరు అపర్ణ పిల్లలు.. రేవతిని చాలా గారాబంగా పెంచారు. ఆ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జగదీష్ ని లవ్ చేసి ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకొని వస్తుంది రేవతి. వాళ్లని చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. మీరు నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఇలా చేసానని రేవతి చెప్తుంది. జగదీశ్ ని సుభాష్ కొడతాడు.

నీకు ఈ ఇంటికి సంబంధం లేదని అపర్ణ ఆ ఇద్దరిని గేంటేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది అక్కడే ఉంది.. మేం ఇక్కడే ఉన్నామని ఇందిరాదేవి చెప్తుంది. తరువాయి భాగంలో శ్రీను వాళ్ల అమ్మకి ఫోన్ చేసాడని రాజ్ కి తెలియడం తో రాజ్ వెళ్తాడు. మరొకవైపు నాకు రాజ్ ని అప్పగించు శ్రీను.. వచ్చి సాక్ష్యం చెప్పేలా చేస్తానని యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.