English | Telugu

దేవుడా ఆడవాళ్ళ సిస్టంని అప్ డేట్ చెయ్యి...

రష్మీ యాంకర్ గానే కాదు ఏ విషయాన్నీ ఐనా చివరకు మహిళల సమస్యలపైనా కూడా చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతుంది. ఇది మాట్లాడకూడదు అన్నది ఆమెలో కనిపించదు. అలాంటి రష్మీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈరోజు మహిళలు తీవ్రంగా ఎదుర్కుంటున్న సమస్య పీరియడ్స్. దాని మీద అందరూ ఆలోచించదగ్గ ఒక పాయింట్ ని డిఫెరెంట్ వేలో తన అభిప్రాయాన్ని చెప్పింది. "ప్రతీ నెల పీరియడ్స్ మూడు రోజులు ఐదు రోజులు కాకుండా యూరిన్ కి ఎలా వెళ్తామో అలా ఎందుకు రాదు ? ఓ దేవుడా సీరియస్ గా చెప్పాలంటే వాష్ రూమ్ కి ఇలా వెళ్లి అలా వచ్చేసేలా ఎందుకు డిజైన్ చేయలేదు.

అప్పుడు ప్యాడ్స్ , మరకలు, టెన్షన్ లాంటివి లేకుండా ఒక్క ఫ్లష్ తో పీరియడ్స్ ఐపోయే అవకాశం లేదా ? దేవుడా నువ్వు మమ్మల్ని ప్యాడ్స్ చుట్టూ, మరకలతో, కడుపులో నొప్పితో, కప్స్ తో, మూడ్ స్వింగ్స్ తో మా లోపల్లోపల ఒక యుద్ధం జరిగేలా చేస్తున్నావ్. నిజం చెప్పాలంటే..ప్రతీ 28 రోజులకు ఒక అమ్మాయి సర్వైవ్ కావడం చాలా కష్టం..దేవుడా ప్లీజ్ అప్ డేట్ సిస్టం" అంటూ రష్మీ ఒక బాధ లాంటి నిర్వేదంతో ఈ పోస్ట్ ని పెట్టినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ రోజున ఆడపిల్లలు మెచ్యూర్ ఐన దగ్గర నుంచి వీటి చుట్టూనే వాళ్ళ మైండ్ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్నీ చాలా సూటిగా, స్పష్టంగా చెప్పింది రష్మీ. రష్మీకి సోషల్ ఇస్స్యూస్ మీద చాలా క్రేజ్ పోస్ట్స్ పెడుతుంది. అవి ఆలోచించే విధంగా ఉంటాయి. ఇక రష్మీ యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె తెలుగు మాట్లాడే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.