English | Telugu

Brahmamudi : ఎంగేజ్ మెంట్ రింగ్ దాచేసిన కనకం.. యామిని ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -749 లో ఇందిరాదేవి, కనకం, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి ఆపాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తారు. యామిని పూజ చేసి హారతి ఇస్తుంది. హారతి గాలికి పోవాలని కనకం ఫ్యాన్ అటుగా తిప్పుతుంది. దాంతో ఆ దీపం ఆగిపోతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇన్ని జరుగుతున్నాయి. పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని పంతులు యామినికి ఫేవర్ గా మాట్లాడతాడు. పంతులు ఫోన్ మాట్లాడుతుంటే.. యామిని వింటుంది. ఎవరు నిన్ను పెళ్లి ఆపమని అంటుందని అడుగుతుంది. దాంతో పంతులు జరిగింది యామినికి చెప్తాడు.

నువ్వు ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరపాలి.. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని యామిని పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ మాటలు పంతులు గుర్తు చేసుకొని యామినికి సపోర్ట్ చేస్తాడు. యామినికి పంతులు సపోర్ట్ చెయ్యడంతో ఇందిరాదేవి వాళ్ళు షాక్ అవుతారు. ఇక నిశ్చితార్థం, పెళ్లి ఒకేసారి అని పంతులు చెప్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి.. అసలు ఎన్ని ప్లాన్ చేస్తన్నావ్.. ఈ పెళ్లి ఆపడానికి అని యామిని అంటుంది. నేనేం చెయ్యడం లేదు.. నేను పెళ్లి ఆపను కానీ పెళ్లి జరగదు.. మా ఆయనకి చివరి నిమిషంలో నేను గుర్తొచ్చినా ఈ పెళ్లి జరగదని కావ్య కాన్ఫిడెన్స్ గా చెప్తుంది.

ఆ తర్వాత అపర్ణ, కనకం, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు. నేను వెళ్లి అల్లుడు గారితోనే మాట్లాడుతానని రాజ్ దగ్గరికి కనకం వెళ్తుంది. అల్లుడు గారు నేను కళావతి అమ్మని.. నా కూతురు మిమ్మల్ని ప్రేమించింది.. మీరు ఎలా ఇలా వేరొక పెళ్లి చేసుకుంటున్నారని అడుగుతుంది. నాకు వేరే ఆప్షన్ లేదని రాజ్ అనగానే ఇన్ని శకునాలు అయినవి ఇక పెళ్లి ఆపండి అని కనకం అంటుంది. తరువాయి భాగంలో రాజ్, యామిని ఎంగేజ్ మెంట్ ల రింగ్ ని కనకం తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.