English | Telugu

Brahmamudi : సామంత్ నిజస్వరూపం బయటపడిందిగా.. అనామిక బ్రహ్మాస్త్రం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -623 లో.....ఇంట్లో అందరికి నిజం చెప్పెద్దామని రాజ్ అనగానే.. అప్పుడు ఇంట్లో జరిగే యుద్ధం గురించి రాజ్ కి కావ్య ఉహించి చెప్తుంటే రాజ్ వద్దని భయపడతాడు. మనమే పగలు ఆఫీస్ లో కష్టపడి రాత్రంత ఆ నందగోపాల్ ని వెతికే పనిలో ఉందాం.. అప్పుడు ఆ వంద కోట్లు కట్టే పని ఉండదని కావ్య అమగానే ఒకవేళవాడు దొరకకపోతే అని రాజ్ నెగటివ్ గా మాట్లాడుతుంటే.. కావ్య తనపై విరుచుకుపడుతుంది.

మరొకవైపు రాహుల్, రుద్రాణిలు ధాన్యలక్ష్మిని ని రెచ్చగొట్టే పనిలో పడతారు. ఇదంతా వీళ్ళ ప్లాన్ అయిదు లక్షలు కూడా లేవా ఇదంతా సుభాష్ అన్నయ్య అపర్ణ వదినలు వెనకాల వుండి నడిపిస్తున్నారని రుద్రాణి అనగానే ధాన్యలక్ష్మి ఇంకా రెచ్చిపోతుంది. మరొకవైపు రాజ్ వాళ్లు అప్పులు చేస్తున్నారని సామంత్ అనామిక లు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని ఇంకా పెద్దది చేసి ఎంజాయ్ చేద్దామని అనామిక అనగానే వద్దు ఇప్పుడు ఇంట్లో వాళ్లకి తెలిస్తే అందరు రాజ్ కి సపోర్ట్ గా ఉంటారు. కంపెనీని దక్కించుకుంటారని సామంత్ అనగానే వాళ్లు సంతోషంగా ఉండొద్దు నాకు కంపెనీ ముఖ్యం కాదని అనామిక అనగానే ఇదేంటి ఇలా అంటుంది కంపెనీని సొంతం చేసుకోవాలనే కదా నేను దీంతో చేరిందని సామంత్ అనుకుంటాడు. మరోవైపు రుద్రాణికి అనామిక ఫోన్ చేసి కావ్యని ఇంట్లో నుండి బయటకు పంపే బ్రహ్మాస్త్రాన్ని పంపిస్తున్నానని చెప్పగానే.. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి.. ఏంటీ ఏంటి ఏదో చేస్తున్నట్టున్నారని స్వప్న అంటుంది.

ఆ తర్వాత కావ్యకి ఇందిరాదేవి నగలు ఇవ్వగా.. వద్దు ఇప్పుడు కంపెనీలో ఏం ప్రాబ్లమ్ లేదని కావ్య అంటుంది. నాకు ఇప్పుడు రిలీఫ్ గా ఉంది ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నువ్వు ఈ నగలు తీసుకునే దానివి అని ఇందిరాదేవి అంటుంది. నేను భయటపడలేదని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి సర్ ప్రైజ్ ఇస్తుంది. మరొకవైపు అపర్ణకి కావ్య కాఫీ ఇస్తుంది కానీ తను తీసుకోదు. తరువాయి భాగంలో మీకు ధైర్యం ఉంటే అత్తయ్య చేత కాఫీ తాగించండి అని కావ్య అనగానే రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ దగ్గరికి వెళ్తాడు. గదిలో నుండీ కాఫీ విసిరేసిన సౌండ్ ఇంకా చెంపదెబ్బ సౌండ్ కావ్య, ఇందిరాదేవిలకి వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.