English | Telugu

Brahmamudi : కొడుకుతో కోడలు సంతోషంగా లేదని వెళ్ళిపోమన్న అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -380 లో.... అనామిక, స్వప్న ఇద్దరు పోటీపడి మరీ ఆఫీస్ కి వెళ్లిన రాహుల్, కళ్యాణ్ లకి క్యారేజ్ కడుతారు. అది చూసిన కావ్య వచ్చి మీరేం చేస్తున్నారు.. ఒక్కరికే అంత ఎందుకు? మీరు వెళ్ళేలోపు అక్కడ భోజనం టైమ్ కూడా అయిపోతుందని కావ్య అంటుంది. ఆ తర్వాత రుద్రాణి కావాలనే కావ్య దగ్గరకి వచ్చి.. పాపం మీ ఆయన ఆఫీస్ కి వెళ్తే నువ్వు అలా దర్జాగా క్యారేజ్ పట్టుకొని వెళ్లేదానివంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

మరొకవైపు రాహుల్ తన బుద్దిని చూపిస్తూ ఫైల్ ఇవ్వడానికి వచ్చిన శృతితో నీ పర్ఫ్యూమ్ బాగుందంటూ మాట్లాడేసరికి.. శృతి చిరాకుగా వెళ్ళిపోతుంది. వారం రోజుల్లో శృతి నా వొళ్ళో ఉండేలా చేస్తానని రాహుల్ అనుకుంటాడు. ఆఫీస్ కి అప్పుడే స్వప్న, అనామికలు వస్తారు. రాహుల్ గురించి శృతిని స్వప్న అడుగుతుంది. నెయిల్ పాలిష్ దగ్గర నుండి షాంపూ వరకు అడుగుతున్నాడని శృతి అనగానే.. నాకు తెలుసు వాడి బుద్ధి వంకర అని అనుకుంటుంది. మరొకవైపు కళ్యాణ్ క్యాబిన్ కి అనామిక వెళ్తుంది. కష్టపడి క్యారేజ్ పట్టుకొని వస్తే పట్టనట్టు ఉంటావని అనామిక అనగానే.. తనకి క్లాస్ పీకి మరి పంపిస్తాడు. భార్య లకి నచ్చింది చేస్తే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకోస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్వేతని కలవడానికి కావ్య వస్తుంది. ఆఫీస్ కి వచ్చి ఏం చేస్తున్నావ్ అంటూ అడుగుతుంటే బుద్ది మారదు కదా అని అనామిక అంటుంది. నీకు కూడా క్లాస్ అయింది కదా అంటు అనామికకి స్వప్న కౌంటర్ వేస్తుంది.

మరొకవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మి లు కావాలనే అపర్ణని రెచ్చగొట్టేలే మాట్లాడతారు. దాంతో అపర్ణ కోప్పడి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్వేతని కావ్య కలుస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికి గెట్ టూ గెధర్ పార్టీ పెడితే అందరూ వస్తారు కదా.. అందులో వెన్నెల కూడా వస్తుందని ఇద్దరు అనుకుంటారు. వెన్నెల ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో నీకు అన్యాయం జరిగింది కదా.. ఎందుకు ఇక్కడే ఉంటున్నావని కావ్యని అపర్ణ అంటుంది. నువ్వు సంతోషంగా ఎప్పుడు లేవు.. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమని కావ్యకి రాజ్ చెప్తాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.