English | Telugu

Brahmamudi : ఆ బిడ్డని వదిలేసి రా.. లేదంటే ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -371 లో... అసలు మనం మంచి ఛాన్స్ ని ఉపయోగించుకోవడం లేదని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఏంటదని రాహుల్ అడుగగా.. రాజ్ ఇంత పెద్ద తప్పు చేసాడు. ఈ విషయాన్ని మనం అందరికి తెలిసేలా ఎందుకు చేయడం లేదు.. పేపర్ మీడియా వాళ్ళకి చెప్తే ఈ కుటుంబం పరువు పోయి రాజ్ ని ఎండీ పదవి నుండి తీసేస్తారు. ఆ కళ్యాణ్ గానికి కవితలు తప్ప క్లయింట్ ని డీల్ చెయ్యడం రాదు. కాబట్టి నువ్వే ఎండీవి కావచ్చని రాహుల్ తో రుద్రాణి చెప్పగానే రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఆ తర్వాత వాళ్ళ మాటలన్నీ విన్న స్వప్న.. వాళ్ళ దగ్గరికి వచ్చి మా కావ్యని ఇబ్బంది పెట్టే పనులు ఏవైనా చేస్తే మీ బాగోతం బయట పెడుతానంటూ రుద్రాణి, రాహుల్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు రాజ్, కావ్య ఇద్దరు ఆఫీస్ కి వస్తారు. రాజ్ చేతిలో బాబుని చూసి.. ఆఫీస్ లో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఎవరు ఆ బాబు అని శృతి అడుగుతుంది. నువ్వు ముందు వర్క్ చేసుకోమంటూ రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత బాబుని రాజ్ తన చైర్ పక్కన పడుకోపెట్టి ఆడిస్తాడు. అప్పుడే కావ్య, శృతి డిజైన్స్ తీసుకొని వస్తారు. అదే సమయంలో మేనేజర్ కూడా వస్తాడు. ఎవరు ఆ బాబు అని అడుగుతాడు. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. మనకు ఎందుకని శ్వేత అతన్ని బయటకు తీసుకొని వెళ్తుంది. కాసేపటికి శ్వేత, మేనేజర్ బయటకు వచ్చి.. రాజ్ గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటే కావ్య వచ్చి వాళ్లకు క్లాస్ పీకుతుంది. మరొకవైపు అప్పు ఇంటికి వచ్చి ఎవరి మీదనో ఉన్న కోపాన్ని కనకం, కృష్ణమూర్తిలపై చూపిస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి శ్వేత వచ్చి.. "ఆ బాబు నీ కొడుకేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావ్? కావ్య అంటే ఇష్టం ఉంది.. అది చెప్పడానికి ఇగో అడ్డువస్తుందని అనుకున్నాను కానీ ఆల్రెడీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారా.. కావ్యని ఎందుకు మోసం చేసావ్" అంటు రాజ్ పై అరుస్తుంది. అయినా రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు.

ఆ తర్వాత శ్వేత కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలన్నీ విన్న కావ్య.. అయితే తన ఫ్రెండ్ కు కూడా ఈ విషయం గురించి తెలియదా? అసలు ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఆ బిడ్డని ఎందుకు తీసుకొని వచ్చారని కావ్య అనుకుంటుంది. ఇక బాబుకి కావ్య బొమ్మలు తీసుకొని వస్తుంటే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎదరుపడతారు. తన సిచువేషన్ చూసి బాధపడతారు. తరువాయి భాగంలో.. బిడ్డని వదిలేసి రా లేదంటే ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకోమని రాజ్ కి అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.