English | Telugu

Brahmamudi : కనకం కామెడీ అదుర్స్.. అల్లుడికి మర్యాద ఇవ్వడం తెలియదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -347 లో.. కావ్య పుట్టింటికి వెళ్తున్నానని రాజ్ కి చెప్పగానే ఒకతే వెళ్తుందనుకొని.. హ్యాపీగా వెళ్లి రా అని చెప్తాడు. కానీ కావ్య వాళ్ళ బావ భాస్కర్ కూడా వెళ్తున్నాడని తెలుసుకున్న రాజ్ జెలస్ ఫీల్ అయి తను కూడా వెళ్ళాలని అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య ఇందిరాదేవి ఇద్దరు రాజ్ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మాతో రాకుంటే ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందని కావ్య అనగానే.. వాడు వచ్చేలా నేను చేస్తానని ఇందిరాదేవి అంటుంది.

ఆ తర్వాత ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వెళ్తుంది. మీ మనవరాలు తన బావ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నారని రాజ్ చిరాకుగా చెప్తాడు.. మరి నువ్వు వెళ్లట్లేదా అని ఇందిరాదేవి అడుగుతుంది. నన్ను ఎవరు పిలిచారని రాజ్ అంటాడు. మీ అత్త నిన్ను పిలవకుండా అవమానిస్తుందా.. ఆగు తననే అడుగుతానంటూ కనకానికి ఇందిరాదేవి కాల్ చేసి అడుగుతుంది. నీకు అల్లుడు అంటే మర్యాద లేదా? నీ ఇంటికి పిలువని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కి కనకం ఫోన్ ఇస్తుంది. మీరు కూడా రండి అల్లుడు అని కనకం చెప్తుంది. అడిగితేనే రమ్మని చెప్తారా నేను రానని రాజ్ అంటాడు. సరే రాకండి అని కనకం అంటుంది. రాజ్ కి ఇంక కోపం వస్తుంది. అప్పుడే కావ్య కూడా వస్తుంది. మీరు కూడా రండి అని అనగానే.. అలా రండి దారికి అని రాజ్ అనుకొని అక్కడ నుండి వెళ్తాడు. కావ్య, ఇందిరదేవిల ప్లాన్ సక్సెస్ అయిందని అనుకుంటారు.

ఆ తర్వాత రాజ్, కావ్య, భాస్కర్ ముగ్గురు కలిసి కనకం ఇంటికి బయలుదేర్తుంటారు. కావ్య, భాస్కర్ లని పిలిచి.. మీరు అక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ కావ్యపై రాజ్ ప్రేమని బయట పెట్టాలని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత భాస్కర్, కావ్యలు పక్కన కూర్చొని ఉంటే రాజ్ జెలస్ గా ఫీల్ అవుతాడు. నేను మీకు డ్రైవర్ నా అనగానే.. నేను డ్రైవ్ చేస్తానని భాస్కర్ ముందుకి వస్తాడు. నేను కావ్య పక్కన కూర్చొను అని రాజ్ అనుకుంటాడు. దాంతో ముందుకి వచ్చేసరికి మళ్ళీ భాస్కర్ పక్కన కావ్య కూర్చొని ఉంటుంది. వేరే దారి లేక రాజ్ ఒక్కడే వెనకాల కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత బావమరదళ్ళు రాజ్ కి కోపం వచ్చేలా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్ళాక.. కనకం కృష్ణమూర్తి, అప్పు ముగ్గురు కలిసి తన కంటే భాస్కర్ కి ఎక్కువ విలువ ఇస్తుంటే రాజ్ చూడలేకపోతాడు. తరువాయి భాగంలో రాజ్ కి శ్వేత ఫోన్ చేసి.. సడన్ గా కావ్య వాళ్ళ బావ ఎందుకు వచ్చాడో తెలుసుకో అని అంటుంది. ఆ తర్వాత కావ్య భాస్కర్ లు సరదాగా మాట్లాడుకుంటుంటే రాజ్ కి కోపం వస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.