English | Telugu

కొత్త సీరియల్ "ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు"లో కనిపించనున్న బీబీ-6 వాసంతికృష్ణన్! 

బిగ్ బాస్ సీజన్ 6 లో గ్లామర్ డాల్ గా అందరినీ అలరించిన వాసంతికృష్ణన్ స్టార్ మాలో ఒక సీరియల్ లో నటిస్తోంది. "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" అనే ఒక కొత్త సీరియల్ లో ఈమె మెయిన్ రోల్ లో కనిపించబోతోంది.

ఇక ఈ సీరియల్ లో సిద్దార్ధ్ వర్మ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో ఒకదాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీరియల్ లో వాసంతి రాయలసీమ యాసలో భలే గమ్మత్తుగా మాట్లాడింది. ఈ స్టోరీ విషయానికి వస్తే - "మనోజ్, ఢిల్లీ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇందులో మనోజ్ రాముడు మంచి బాలుడు టైపు. కానీ ఒళ్ళంతా కూడా ఓసీడి..ఇక ఢిల్లీ అనే వాడికి ఒళ్ళంతా పొగరు. వీడు మహా కంత్రి టైపు. ఇద్దరూ ఒకే కడుపున పుట్టినా కూడా మనోజ్ బెంగళూరులో ఢిల్లీ కాళహస్తిలో పెరుగుతూ ఉంటారు.

తిమ్మిని బమ్మిని చేసే ఢిల్లీ గాడు కళావతి మెడలో తాళి కడితే మనోజ్ మాత్రం పూజని పెళ్లి చేసుకుంటాడు. ఈ క్లాసు..మాస్ భార్యభర్తల యవ్వారం ఎట్టా ఉండబోతోందో ? త్వరలో మీ స్టార్ మా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడండి అని ఈ స్టోరీ మెయిన్ లైన్ గురించి వాయిస్ ఓవర్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్. ఐతే ఈ సీరియల్ ఏ టైం స్లాట్ లో ప్రసారమవుతుందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా ఉంచారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.