English | Telugu

Jayam serial : వినాయకుడి విగ్రహం మాయం.. వీరూనే చేసి ఉంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -46 లో.....సూపర్ మార్కెట్ ని బంద్ చేసి రుద్రని డెవలప్ కాకుండా చెయ్యాలని వీరు ప్లాన్ చేస్తాడు. కానీ రుద్ర ముందే సమస్యని పసిగట్టి పరిష్కరిస్తాడు. ఇక వినాయకుడి విగ్రహలు రావడం లేట్ అయ్యేలా వీరు చేస్తాడు. కానీ గంగ మట్టితో విగ్రహాలని రెడీ చేస్తుంది.

గంగ వంక రుద్ర అలానే చూస్తుంటాడు. రుద్ర గాడిని దెబ్బ కొట్టాలంటే అన్నీ అడ్డంకులే ఈ గంగ వల్ల మొత్తం చెడిపోయింది.. రుద్రకి గంగ తోడైతే ఏం చెయ్యలేమని వీరు అనుకుంటాడు. అప్పుడే వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. అనుకున్నది ఏం జరగడం లేదని ఇషికతో వీరు అంటాడు. ఆ గంగకి ఆ దేవుడి సపోర్ట్ ఉందేమో... అందుకే ఏం చెయ్యలేకపోతున్నామని ఇషిక అంటుంది.

ఆ తర్వాత ఆ దేవుడినే మాయం చేస్తే అని వీరు అనగానే ఏం అంటున్నావ్ బ్రో అని ఇషిక షాక్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం ఇందుమతి హాల్లోకి వస్తుంది. వినాయకుడి విగ్రహం అక్కడ ఉండదు.. దాంతో తను షాక్ అయి అందరిని పిలుస్తుంది. ఆ విషయం ఇందుమతి చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. వినయకుడి విగ్రహం కన్పించకపోవడం ఏంటని ఇంట్లో అందరు అనుకుంటారు. అప్పుడే గంగ వస్తుంది. విషయం తెలిసి షాక్ అవుతుంది. అసలు వినాయకుడి విగ్రహం ఎవరు తీశారు.. వీరూనే తీసి ఉంటాడా.. తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.