English | Telugu

Bigg Boss 9 Telugu : బీబీరాజ్యంలోని ప్రజలను ఆడుకున్న రాజు, రాణులు!


బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం అనే టాస్క్ నడుస్తుంది. కళ్యాణ్ రాజు దివ్య, రీతూ ఇద్దరు రాణీలు అయితే వీళ్ళకి నలుగురు కామండర్స్, నలుగురు ప్రజలు ఉంటారు. రాజు, రాణి కలిసి ప్రజలని ఒక అట ఆడేసుకుంటారు. నాకు అది తినాలనిపిస్తుంది.. ఇది తినాలనిపిస్తుందంటూ ముగ్గురు ప్రజలని టార్చర్ పెడతారు.

సుమన్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నువ్వు చిరునవ్వు నవ్వుతూ.. మెగాస్టార్ వీణ స్టెప్ చెయ్యమని సుమన్ కి రీతూ చెప్తుంది. సుమన్ బాగా చేస్తాడు. చిరునవ్వు అన్న ప్రతీసారి ఇలా చెయ్యాలని చెప్తారు. ఆ తర్వాత భరణిని పిలుస్తారు. మీరు చిరునవ్వు అన్నప్పుడు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే స్టెప్ వెయ్యాలని భరణికి దివ్య చెప్తుంది. దాంతో భరణి డాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ని పిలిచి ఈ పేటకి నేనే మేస్త్రి అనే సాంగ్ కి సిగ్నేచర్ స్టెప్ చెయ్యమని రీతూ వాళ్ళు ఆర్డర్ వేస్తారు. దాంతో ఇమ్మాన్యుయల్
ఆ స్టెప్ వేస్తాడు. ఆ తర్వాత ప్రజా సుమన్ మాకు తాగడానికి షుగర్ లెమన్ వాటర్ తీసుకొని రండి అని రీతూ ఆర్డర్ వేస్తుంది. ఇక భరణి టాస్క్ స్టార్ట్ కాకముందు దివ్యని ఏదో అన్నాడని రాణిగా తన చేతులు కట్టివేయిస్తుంది.

ఆ తర్వాత వాటర్ మిలన్ నాకూ తినిపించమని సుమన్ కి రీతూ ఆర్డర్ వేస్తుంది. తినకపోతే బుజ్జగించి తినిపించాలని రీతూ చెప్తుంది. సుమన్ తినిపిస్తుంటే రీతూ ఒక దగ్గర ఉండకుండా టేబుల్ ఎక్కుతుంది. దాంతో సుమన్ కూడా టేబుల్ ఎక్కి తినిపిస్తాడు. అలా రీతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తినిపిస్తాడు. ఈ విధంగా రాణీలు ఇద్దరు ప్రజలతో పనులు చేయించి రాక్షసానందం పొందారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.