English | Telugu

Bigg Boss 9 Telugu Promo : ఈ సారి చదరంగం కాదు రణరంగమే!

బిగ్ బాస్ తెలుగు అప్టేడ్ వచ్చేసింది.. అదే ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే బిగ్ బాస్ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్, ఎనిమిది సీజన్లో నిఖిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరుంటారు.. జడ్జ్ ఎవరు అనే క్యూరియాసిటి నిన్నటి వరకు అందరిలో ఉంది. కానీ నిన్న రిలీజ్ అయిన ప్రోమోతో ఆ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి.

నాగార్జున హోస్ట్ గా తాజాగా ఓ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో నాగార్జున ఓ పెద్ద సుత్తి పట్టుకొని వచ్చాడు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అని నాగార్జున చెప్పాడు. ఇక ప్రోమో చివర్లో ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటు ఫైనల్ టచ్ ఇచ్చేశాడు.

ఈ ప్రోమోని బట్టి చూస్తే గత సీజన్లోతో పోలిస్తే గేమ్స్ అండ్ పోటీ ఎక్కువగానే ఉండేట్టుగా ఉంది. ఇక ఆట డోస్ పెంచేట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ సీజన్ కి హోస్ట్ నాగార్జున అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఎప్పుడు మొదలవుతుంది.. కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రోమోని బట్టి చూస్తే మరో మూడు వారాల్లో బిగ్ బాస్-9(Bigg Boss 9 Telugu) ప్రారంభం అయ్యేలా ఉంది. ఇక ఈ ప్రోమో యూట్యూబ్ లో ఇప్పటికే అత్యధిక వ్యూస్ ని తెచ్చుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.