English | Telugu

రవితేజ, సిద్దార్థ్ లతో గ్రాంఢ్ లాంచ్ 2.0 ప్రోమో అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే ఐదు వారాలు పూర్తయింది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు ఐదవ వారం ఎవరు ఎలినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. అయితే ప్రతీ శనివారం నాగార్జున కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవ్వడం, సండే ఫండే అంటూ సాగుతుందనే విషయం తెలిసిందే.

నిన్న జరిగిన శనివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్లో ఉన్న బాటమ్-3 ఎవరని నాగార్జున అడిగాడు. అందులో మెజారిటీ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, శుభశ్రీ, ప్రియాంక జైన్ అన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సండే ప్రోమోలో కొన్ని క్లూస్ ని ఇచ్చాడు నాగార్జున. ఈ రోజు గ్రాంఢ్ లాంచ్ 2.0 ఉంటుంది. దానికి గెస్ట్ లుగా మాస్ మహారాజ రవితేజ, బొమ్మరిల్లు సిద్దార్థ్ వస్తున్నారు.

అయితే గ్రాంఢ్ లాంచ్ లో ఇప్పటికే ఏడుగురు కన్ఫమ్ అవ్వగా.. చివరి నిమిషంలో కెవ్వు కార్తిక్ , అంజలి పవన్ డ్రాప్ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సాయంత్రం7 గంటలకు మొదలయ్యే గ్రాంఢ్ లాంచ్ వరకు ఆగాల్సిందే. కాగా రవితేజని హౌజ్ లోకి పంపించి కంటెస్టెంట్స్ చేత ఒక టాస్క్ చేపించినట్టుగా ప్రోమోలో నాగార్జున చెప్పాడు. కాగా బొమ్మరిల్లు సిద్దార్థ్ తో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదని అనగా.. క్రేజీ అని ప్రియాంక జైన్ అంది. మాస్ మహారాజా హౌజ్ లోకి వెళ్ళి ఎవరిని స్టేజ్ మీదకి తీసుకొస్తాడో తెలియాల్సి ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.