English | Telugu

టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అంబటి అర్జున్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరి అంచనాలకు అందకుండా అంబటి అర్జున్ ఆడి గెలిచాడు. ఎవరినీ ఒక్క పాయింట్ కూడా అడుగకుండా ' టికెట్ టూ ఫినాలే ' కి అర్హత సాధించిన తొలి హౌస్ మేట్ గా అంబటి అర్జున్ నిలిచాడు.

గ్రాంఢ్ లాంచ్ 2.0 లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రి ఇచ్చిన కంటెస్టెంట్ అంబటి అర్జున్. ఆటలో తప్ప బయట పెద్దగా ఎవరితోను మాట్లాడకుండా అవసరానికి మించి ఏమీ చేయడు అన్నట్టుగా ఉంటూ వస్తున్నాడు అంబటి అర్జున్. 'టికెట్ టు ఫినాలే' కోసం హౌస్ లోని ఎనిమిది మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా గత వారం రోజుల నుండి టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. తొలి టాస్క్ లో శోభాశెట్టి, శివాజీ టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నారు. వారిద్దరు కలిసి తమ పాయింట్లను అమర్ దీప్ కి ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక రేస్ నుండి తప్పుకొని తన పాయింట్లని గౌతమ్ కి ఇచ్చింది. ఇక కొన్ని టాస్క్ ల తర్వాత యావర్ లీస్ట్ లో ఉండగా అతని పాయింట్లని పల్లవి ప్రశాంత్ కి ఇచ్చాడు. ఇక గౌతమ్ కృష్ణ లీస్ట్ లో ఉండి తన పాయింట్లని అమర్ దీప్ కి ఇచ్చాడు‌. ఈ పాయింట్లని ప్రియాంక ఇస్తున్నట్టు, ఇంకెప్పుడు ప్రియాంకని ఇవ్వలేదని సపోర్ట్ చేయలేదని అనకు అంటూ గౌతమ్ చెప్పాడు.

ఇక ఫైనల్ గా అమర్, అర్జున్, ప్రశాంత్.. ఈ ముగ్గురు ఉండటంతో కండబలం నిరూపించుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. ఇందులో అర్జున్ ఒక చేతితో అమర్ దీప్ ని, మరో చేత్తో పల్లవి ప్రశాంత్ ని లాగి పరేశాడు. ఒక దగ్గర అర్జున్ ఆగితే అవతలి నుండి ఇద్దరు కలిసి లాగినా కదలట్లేదు. అంత కసిగా ఆడాడు అంబటి అర్జున్.. ఇక ఈ టాస్క్ లో పది జెండాలని బుట్టలో వేసి విజేతగా నిలిచాడు అర్జున్. రెండు జెండాలు బుట్టలో వేసి రెండవ స్థానంలో అమర్, ఒక్క జెండాని బుట్టలో వేసి ప్రశాంత్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత లీస్ట్ స్కోర్ గా ఉన్న ప్రశాంత్ టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక అమర్‌దీప్, అర్జున్ లకి స్నేక్ మీద స్నూకర్ బాల్ ని, రోప్ ల సహాయంతో వేలాడే వేలాడే వుడ్ తో మెల్లిగా పై వరకు తీసుకెళ్ళి గోల్ఫ్ చేయాలని బిగ్ బాస్ చెప్పగా.. అందులో అర్జున్ గెలిచాడు. దాంతో ఫినాలే అస్త్రని సాధించిన మొదడి హౌస్ మేట్ గా అంబటి అర్జున్ నిలిచాడు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.