English | Telugu

పనికిమాలినోడ అంటూ రాంప్రసాద్ పరువు తీసేసిన అన్నపూర్ణ

వినాయక చవితి పండగ రోజున అన్నీ ఫన్ ఓరియెంటెడ్ కార్యక్రమాలతో బుల్లి తెర మెరిసిపోయింది. ఈటీవీలో "మన ఊరి దేవుడు" పేరుతో వచ్చిన ప్రోగ్రాం చాలా బాగా హైలైట్ అయ్యింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఒక టీమ్ తరపున వస్తుంది. "పండగకు ఏం స్పెషల్స్ చేస్తున్నారేమిటి" అంటూ ప్రదీప్ అన్నపూర్ణను అడుగుతాడు. "నేను మాత్రం పాయసం చేస్తాను అంటుంది. ఇంతలో మరో టీమ్ నుంచి ఆటో రాంప్రసాద్ వచ్చి ఆయాసం వచ్చే వయసులో పాయసం చేయడమెందుకు రెస్ట్ తీసుకోక" అంటాడు. "ఒరేయ్ పనికిమాలినోడా ఇంతా ఆయాసంతోనే ఐదారు స్కిట్లు చేయించుకున్నాడు ఒక సిగ్గులేనోడు" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది.

"ఇక ఏమీ తెలియనట్టు ఎవడు అని రాంప్రసాద్ అనేసరికి ఎవడో" అంటుంది అన్నపూర్ణ. "నేనైతే కుడుములు చేస్తా" అని మలక్ పేట శైలజ అనేసరికి "ఈ ఉడుము మొహమేసుకుని కుడుములు చేస్తే మా టీమ్ లో గణపతి మాస్టారు కూడా తినడు" అని ఆది పంచ్ వేసేసరికి పళ్ళు నూరుతుంది శైలజ. ఇక తర్వాత నాటి నరేష్ వచ్చి ఖుష్బూను పొగుడుతాడు. "ప్రపంచంలో అందమైన రెండు ఒకటి మీరు రెండు నేను" అని బుగ్గ గిల్లేసరికి గట్టిగా నరేష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. "వాడు వేసుకున్న షర్ట్ కలర్ మొత్తం పోయే వరకు మీ అన్నయ్యలతో బాగా ఉతింకించమ్మా" అంటూ అన్నపూర్ణమ్మ అంటుంది. ఆ డైలాగ్ కి అందరూ నవ్వేశారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.