English | Telugu

ఏంజిల్ మాట వినకుండా వెళ్ళిన రిషి.. ఫణీంద్ర వేసిన శిక్ష అదేనా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -873 లో.. ఫణింద్ర దగ్గరికి జగతి మహేంద్ర ఇద్దరు వస్తారు. అన్నయ్య భోజనానికి రావడం లేదని అనగానే.. నేను రాను ఇక్కడే తింటానని ఫణింద్ర కోపంగా అంటాడు. మేం ఏం తప్పు చేశామని అంత కోపంగా ఉన్నారని ఫణీంద్రని మహేంద్ర అడుగుతాడు. నాకు రిషి గురించి చెప్పకుండా ఎందుకు దాచారు. అంత పరాయివాన్నయ్యానా? ఇది కోపం కాదు బాధ మాత్రమేనని ఫణింద్ర అంటాడు. జగతి మహేంద్రలను అక్కడ నుండి వెళ్ళమని చెప్తాడు ఫణింద్ర.

ఆ తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరు ఫణింద్ర దగ్గర నుండి రావడం చుసిన దేవయాని.. మా ప్లాన్ సక్సెస్ అయింది అన్నటుగా.. ఇక ఇప్పుడే మెల్లి మెల్లిగా DBST కాలేజీని మా సొంతం చేసుకుంటానని అంటుంది. మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. రిషి ఇంకా ఇంటికి రాలేదు. నీకు ఏమైనా తెలుసేమోనని వచ్చాను. అయిన ఆ కాలేజీకీ ప్రాబ్లమ్ వస్తే రిషి ఎందుకు వెళ్ళాడు. నువ్వు ఎందుకు వెళ్ళావని ఏంజిల్ అడుగుతుంది. కాలేజీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా అని ఏంజిల్ అనగానే .. సాల్వ్ చేశారు అని వసుధార చెప్తుంది. రిషి తన భార్య గురించి పదిహేను రోజుల్లో చెప్తానన్నాడు కదా తన భార్య ఎవరో నువ్వు గెస్ చేయగలవా? రిషి భార్య గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటి ఉందని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత వసుధారని ఏంజెల్ తన ఇంటికి తీసుకొని వెళ్తుంది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార, ఏంజిల్ ఇద్దరు హాల్లో పడుకొని ఉంటారు. రిషి తన గదిలో నుండి బ్యాగ్ తో వస్తుంటే వసుధార చూసి ఏంజిల్ కి చెప్తుంది. రిషి ఎక్కడికీ వెళ్తున్నావని ఏంజిల్ అడుగుతుంది. నేను ఇక ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదని రిషి చెప్పగానే.. వద్దు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని ఏంజిల్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు నాకు ఫ్రెండ్ వి.. నీ దృష్టిలో నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రావడం తప్పని రిషి అంటాడు. నువ్వు నా ఫ్రెండ్ వి కాదని అనట్లేదు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నీకు పెళ్లి అయిందన్నావ్. పదిహేను రోజులు గడువు ఇచ్చాను. నువ్వు వెళ్ళకు రిషి. నీ ముందు ఆ టాపిక్ తియ్యనని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజిల్‌. అలా చెప్పిన రిషి వినకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.