English | Telugu

అవి లేకపోతే రవి బతకలేడు!.. బ‌య‌ట‌పెట్టిన లాస్య‌!!

బుల్లితెరపై యాంకర్ రవి, లాస్య అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. 'సంథింగ్ స్పెషల్' అంటూ ఈ జంట యాంకర్లుగా చేసిన ఈ షో మంచి టీఆర్పీల‌ను రాబట్టింది. అప్పట్లో రవి, లాస్య జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు. కానీ కొన్నాళ్లకే ఇద్దరి మధ్య గొడవలు రావడం, విడిపోవడం.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం వంటివి జరగడంతో ఆన్ స్క్రీన్ మీద ఈ జంట కనిపించకుండాపోయింది. అలా దాదాపు ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు మళ్లీ రవి, లాస్య జంటగా కనిపించడం మొదలుపెట్టారు.

సంక్రాంతి ఈవెంట్ నుండి ఇద్దరూ బుల్లితెరపై రచ్చ చేయడం ప్రారంభించారు. ఈవెంట్లతో పాటు కామెడీ స్టార్స్ అనే షోలో హల్చల్ చేస్తున్నారు. మునుపటికంటే మరింత జోరుతో ముందుకు వెళ్తున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ స్పూఫ్ లతో రచ్చ చేస్తున్నారు. ఈ ఇద్దరికీ ఉన్న డిమాండ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పలు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా ఆర్జే కాజల్ ఈ జంటను ఇంటర్వ్యూ చేసింది. అందులో కొన్ని ప్రశ్నలకు లాస్య చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "ఏ మూడు వస్తువులు లేకపోతే రవి బతకలేడు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు లాస్య వెరైటీగా బదులిచ్చింది. సోషల్ మీడియా, ఫోన్, శానిటైజర్ లేకపోతే రవి బతకలేడని.. మరీ ముఖ్యంగా శానిటైజర్ అయితే ఎప్పుడూ కారులోనే ఉంటుందని చెప్పింది. కరోనా రాకముందు కూడా రవి శానిటైజర్ వాడేవాడని.. ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజర్ రాసుకుంటాడని చెప్పుకొచ్చింది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.