Read more!

English | Telugu

ఈ నెల 30 న నాటకం...లేటెస్ట్ అప్ డేట్ ని షేర్ చేసుకున్న ఝాన్సీ

 

యాంకర్ ఝాన్సీ దూరదర్శన్ ఉన్న రోజుల నుంచి అందరికీ తెలిసిన ఒక యాంకర్. అందరూ సోషల్ మీడియాని వాడుకుంటూ తమ లేటెస్ట్ అప్ డేట్స్ ని చెప్తూండేసరికి ఝాన్సీ కూడా అదే బాటలో పయనిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ విషయాలను తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక విషయాన్ని చెప్పింది. " హాయ్ ఇన్స్టా ఫామిలీ చాలా రోజులయ్యింది కదా ఏదైనా పోస్ట్ చేసి..నా బుర్ర చాలా బిజీగా ఉంది.

అందుకే ఏమీ పోస్ట్ చేయలేకపోయాను. అసలు నేను ఎం చేస్తున్నాను అంటే ఒక థియేటర్ ప్రాజెక్ట్ ని రాసే పనిలో ఉన్నాను . అంటే ఒక నాటకం రాస్తున్నాను..దానికి డైరెక్షన్ చేయబోతున్నాను.. మీరంతా గుర్తుపెట్టుకోండి ఈ నెల 30 న రంగభూమిలో ఈ నాటక ప్రదర్శన ఉంటుంది.. నా డీటెయిల్స్ నా లేటెస్ట్ అప్ డేట్స్, నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చాలా ఇంటరెస్ట్ తో అడుగుతున్నారు కాబట్టి అలాంటి వాళ్లకు ఈ అప్ డేట్ ని అందిస్తున్నాను. ఈ నెల 30 న డేట్ బ్లాక్ చేసుకోండి.

ఆ రోజు రాత్రి 7 నుంచి 9 మధ్యలో నాటకం ఉంటుంది. ఇక ఈ నాటకం ఏమిటి ఎవరెవరు నటిస్తున్నారు వంటి మిగతా అప్ డేట్స్ ని త్వరలో రిలీజ్ చేస్తాను..చూస్తూనే ఉండండి" అంటూ ఒక అనౌన్స్మెంట్ ని ఇచ్చారు ఝాన్సీ.  ఒకప్పుడు  బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేసింది ఝాన్సీ.  జెమిని టీవీలో ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అంటూ ఝాన్సీ చేసిన హోస్టింగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే .  

సండే సందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా,  కో అంటే కోటి, లక్కూ కిక్కూ ఇలా చాలా కార్యక్రమాలతో  బుల్లితెరపై చెరగని ముద్రవేసుకున్నారు ఝాన్సీ. బుల్లితెర ఈవెంట్స్ లోనే కాదు మూవీస్ లోనూ నటించారు.   ఎగిరే పావురమా సినిమాతో మొదలుపెట్టి  రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య,  F2,మల్లేశం, శ్రీరామ రాజ్యం, జయం మనదేరా, భద్ర, తులసి, మస్కా, సింహా, గోల్కొండ హైస్కూల్ లాంటి  50‌కి పైగా మూవీస్ లో నటించారు.