English | Telugu

ప్రాకృతికి ఇచ్చిపడేసిన అమర్ దీప్...



డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మానస్ కి ప్రాకృతికి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే మానస్ మొదట్లో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు తర్వాత వైల్డ్ కార్డు ద్వారా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే కొత్త కంటెస్టెంట్ సాగరికతో వచ్చాడు. మానస్ ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టుకున్నాడు. డాన్స్ తో దుమ్ము దులిపి ఆరేసాడు. వైల్డ్ కార్డులో ఎవరొచ్చినా నామినేట్ చేసేస్తారా..?వైల్డ్ కార్డులో రావడం పాపమా ? నామినేట్ చేయడమంటే డాన్స్ బాలేదనో, స్టెప్స్ సరిగా లేవనో చెప్పి నామినేట్ చేయాలి. ఐనా ఎవరో పంపిస్తే వెళ్ళిపోయి ఎవరో పంపిస్తే షోలోకి రావడం కాదు. కంటెస్టెంట్ కి బాగోకపోవడం వలన సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకు వచ్చాడు తప్ప అక్కడ ఎవరు ఎవరినీ పంపించేంత సీన్ లేదక్కడ అన్నాడు అమర్.

ఐనా కంటెస్టెంట్స్ వలన మెంటార్స్ కి పేరు కానీ మెంటార్స్ వలన కంటెస్టెంట్స్ కి పేరు లేదు. మెంటార్స్ వాళ్ళను రిప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు పేరు. కాబట్టి వాళ్ళను ఎవరూ తోసేయలేరు. కాబట్టి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్న మానస్ - సాగరికాకి ఓటు వేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో చేసి పోస్ట్ చేసాడు. అది డాన్స్ కాంపిటీషన్..అక్కడ డాన్స్ ని మాత్రమే చూడాలి..కాబట్టి వాళ్ళను ఎవరూ బయటకు తోసేయలేరు అని చెప్పాడు. ఐతే ఈ డాన్స్ ఐకాన్ లో ప్రకృతి మాట్లాడిన మాటల మీద నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇది టెంపరరీ షో కానీ ఆమె మాత్రం చాలా పర్సనల్ గా మాట్లాడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సాగరికా రావడం రావడమే ఓంకార్ ఇచ్చిన థీమ్ కి సరితూగే డాన్స్ చేసి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అది డాన్స్ కాంపిటీషన్ అమ్మ.. ప్రాకృతికి ఇచ్చిపడేశాడు అమర్ దీప్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.