English | Telugu

రాజు గారి గది 4 లో చిన్న దెయ్యంగా నటించే ఛాన్స్ కొట్టేసిన బినిత


డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం షో ఫుల్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. మంచి డాన్స్ లతో అలరించింది. ఫైనల్ గా ప్రాకృతి - మానస్ కి మధ్య ఎప్పటిలాగే గొడవ జరిగిపోయింది. ఐతే ప్రాకృతి తన మాటలకు సారీ చెప్పింది. ఐతే ఇంత షోలో యష్ మాష్టర్ కంటెస్టెంట్ కి ఓంకార్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె ఎవరో బినిత ఛెత్రి. అసలు బినీత డాన్స్ మాములుగా ఉండదు. ఈమె ఇండియాస్ గాట్ టాలెంట్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ అంతా షాకయ్యారు.... ఆమె డాన్స్ కి ఫిదా ఇపోయారు. ఇప్పుడు ఆమె తెలుగు డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో యష్ మాష్టర్ కంటెస్టెంట్ గా ఉంది. ఈ వారం బినిత డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాక యాంకర్ ఓంకార్ ఒక మాట అన్నాడు. నెక్స్ట్ "రాజు గారి గది 4 " చేస్తే గనక బినితని డెఫినిట్ గా తీసుకుంటాను అని చెప్పాడు.

"మరి ఏంటి బినిత యాక్ట్ చేస్తావా" అని అడిగేసరికి చేస్తాను అని చెప్పింది. "చిన్న దెయ్యంగా నటిస్తుంది" అన్నాడు యష్. దానికి ఓంకార్ కూడా చిన్న దెయ్యంగా నటించాలి అన్నాడు. ఇక ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శేఖర్ మాష్టర్ ఐతే ఫిదా ఐపోయాడు. "ఎం డాన్స్ అమ్మా నీది..నువ్వు ఇండియానే కదా నీ డాన్స్ తో వరల్డ్ ని కూడా షేక్ చేసే రోజు కూడా రావొచ్చు. బినిత చాలా రేర్ పీస్. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బెస్ట్ పెర్ఫామర్...బెస్ట్ డాన్సర్ వి " అని చెప్పాడు. ఫైనల్ లో ఎలిమినేషన్స్ రౌండ్ లో యష్ మాష్టర్ తన కంటెస్టెంట్ బినితకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న ప్రకృతిని - బర్కత్ జోడిని ఎలిమినేట్ చేసాడు. యష్ ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా తన చోటా కంటెస్టెంట్ ని కాపాడుకుంటూ ఆమెకు ఎవరూ కాంపిటీషన్ లేకుండా స్ట్రాటజీగా గేమ్ ప్లే చేస్తూ వస్తున్నాడు. ఈ వారం కూడా యష్ - బినిత సేఫ్ జోన్ లో ఉన్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.