English | Telugu

టేస్టీ తేజని కిడ్నాప్ చేసారు!

పట్టపగలు.. నడి రోడ్డు మీద కిడ్నాప్ చేస్తేనే దిక్కులేదు. అలాంటిది నైట్ టైమ్ ఒంటరిగా తిరిగితే కిడ్నాప్ చేయరా.. బిగ్ బాస్ హౌస్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా అడుగుపెట్టిన టేస్టీ తేజ కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ ఎవరు చేశారు? ఎందుకు చేశారో ఓసారి చూసేద్దాం...

రెండు రోజుల క్రితం టేస్టీ తేజ గురించి అమర్ దీప్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. అదేంటంటే నేను మా ఇంటికి రమ్మంటే రావు గానీ శుభశ్రీ రమ్మంటే షాపింగ్ కి వెళ్తావా అని ఓ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిన షాపింగ్ వీడియోకి అతడిని ట్యాగ్ చేసి అన్నాడు. ఇక తాజాగా టేస్టో తేజని తన కార్ లో తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను వదిలేయ్ రా అంటు టేస్టీ తేజ అరిచేశాడు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ రా అని అడిగిన అమర్ చెప్పలేదు. టేస్టీ తేజ, అమర్ దీప్ ఇద్దరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మంచి స్నేహితులుగా ఉన్నారు. హౌస్ లో‌ ఎక్కువ సార్లు వీరిద్దరి మధ్య బాండింగ్ ఉండేది‌. అందుకే బయటకొచ్చాక కూడా ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువగా వ్లాగ్స్ చేస్తున్నాడు టేస్టీ తేజ.

ఫైనల్ గా ఓ రెస్టారెంట్ టేస్టీ తేజని తీసుకెళ్ళి కడుపునిండా భోజనం పెట్టించాడు అమర్ దీప్. తీసుకొస్తే తీసుకొచ్చావ్ గానీ కమ్మని భోజనం పెట్టావ్ రా అని టేస్టీ తేజ అన్నాడు. ఇంతకీ ఈ హోటల్ పేరెంట్రా అని తేజ అనగా.. రా తిను అని అమర్ అంటాడు .. తిన్నా గనీ చెప్పరా అని తేజ అనగా.. రెస్టారెంట్ పేరే రా తిను అని అమర్ అన్నాడు. ఓరీనీ అవునా.. కబాబ్స్,కుక్కర్ రైస్ పులావ్ అన్నీ బాగున్నాయ్ అంటు తేజ అన్నాడు. ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని వారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ బాండింగ్ ని కొనసాగించారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.