English | Telugu

అంబానీ గారు మీకెందుకు దిష్టి కొట్టదో ఆ సీక్రెట్ కొంచెం చెప్తారా...



దిష్టి అనే కాన్సెప్ట్ కి అన్ని మతాల్లో కూడా స్పెషల్ ప్లేస్ ఉంది. కొత్త దుస్తులు వేసుకుంటే దిష్టి కొడుతుందని దానికి పసుపు రాసి వేసుకోమంటారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చూడడానికి అందంగా ఉంటే దిష్టి కొడుతుందని నల్ల తాడు కడతారు లేదంటే ముఖం మీద దిష్టి చుక్క పెడతారు. నరుడు చూపుకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మన వెనకటి తరాల్లో ఎక్కువగా ఉండేది. ఐతే ప్రస్తుత జెనెరేషన్ లో దీన్ని కొంతమంది నమ్ముతారు కొందరు నమ్మరు. పాజిటివ్ ఎనర్జీ అని నెగటివ్ ఎనేర్జి అని కొట్టి పారేస్తారు.

ఏదేమైనా అఖిల్ సార్థక్ కూడా దిష్టి కాన్సెప్ట్ మీద తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "మధ్య తరగతి వాళ్ళు ఏదైనా మంచి పిక్ ని అప్ లోడ్ చేస్తే చాలు వాళ్లకు దిష్టి కొట్టేస్తుంది. మరి అంబానీలు ఎంతో ఖరీదైన వస్తువులను ధరించి పిక్స్ పెడతారు, అందంగా కనిపిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళను పిలిచి అన్నీ చూపిస్తారు కదా..మరి వాళ్లకు ఎందుకు దిష్టి కొట్టదు...అంబానీ గారు మీకెందుకు దిష్టి కొట్టదు మాకే ఎందుకు దిష్టి కొడుతోంది. దిష్టి తగలకుండా మీరు ఫాలో అయ్యే సీక్రెట్ చెప్పండి" అని అడిగాడు. పాపం ఏమయ్యిందో కానీ తన పిక్ కి ఎవరు దిష్టి పెట్టారో కానీ అఖిల్ కన్నుకి ఏదో అయ్యింది. దాంతో కొంచెం అప్ సెట్ గా కనిపించాడు. కంటిని తుడుచుకుంటూ ఉన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 7 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి అండగా నిలుచున్నాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ మంచి అవకాశాలు వచ్చాయి కానీ అఖిల్ సార్థక్ కి మాత్రం ఇంకా కెరీర్ స్టార్ట్ కాలేదనే చెప్పొచ్చు. అవకాశాలు రావాలంటే రైట్ టైమ్ రావాలి.. దాని కోసమే ఎదురుచూస్తున్నాడు అఖిల్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.