Read more!

English | Telugu

బిగ్ బాస్ లో అడవి శేష్.. 'కోడి బుర్ర' ఎవరో కనిపెట్టాడా?

బిగ్ బాస్ హౌస్ లో సండే వచ్చిందంటే ఫన్ ఫుల్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. నాగార్జున వచ్చి ఒక్కో కంటెస్టెంట్ వారం మొత్తం ఏం చేసారో? ఎవరు ఎలా ఉన్నారో? అని అడిగి తెలుసుకుంటాడు. అయితే ఇందులో ఒక్కోసారి గెస్ట్ లను తీసుకొస్తూ ఉంటాడు నాగార్జున.

హౌస్ మేట్స్ అందరికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. "మీలో ఒకరు మిర్రర్ పై ఒక పుర్రె బొమ్మని గీసి, 'కోడి బుర్ర' అని రాయాలి" అని చెప్పాడు నాగార్జున. రేవంత్ ఒక లిప్ స్టిక్ తో బొమ్మని గీసాడు. ఆ తర్వాత నాగార్జున ఇప్పుడు హౌస్ లోకి కూల్ కాప్ వస్తున్నాడని చెప్పాడు.

తన కొత్త సినిమా 'హిట్' తో మంచి హిట్ కొట్టిన 'అడవి శేష్' ని గెస్ట్ గా తీసుకొచ్చాడు నాగార్జున. అయితే అతను వచ్చాక నాగార్జున సరదాగా సాల్వ్ చేయమని ఒక కేస్ అప్పగించాడు. "బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిర్రర్ పై ఎవరో 'కోడి బుర్ర' అని రాసారు అది ఎవరో కనిపెట్టు?" అని చెప్పగా, శేష్ అది ఎవరు రాసారో అని సాల్వ్ చేసే పనిలో కంటెస్టెంట్స్ తో సరదగా కొన్ని గేమ్స్ ఆడించాడు. "ఆదిరెడ్డి గారు మీరే కదా ఆ బొమ్మ గీసింది" అని అనగా, "అది మీరు కనిపెట్టాలి" అని ఆదిరెడ్డి అనగా, "యూ ఆర్ రైట్ ఆది" అంటూ నాగార్జున నవ్వేసాడు. ఆ తర్వాత శ్రీహాన్ తన చేతిలోని లిప్ స్టిక్ ని పడేయగా, "ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే కచ్చితంగా నువ్వు కాదు శ్రీహాన్" అని శేష్ అన్నాడు. దీంతో హౌస్ లో నవ్వులు పూసాయి. రేవంత్ రాసింది అని కనిపెట్టాడు. ఆ తర్వాత గేమ్ ఆడిస్తూ వినోదాన్ని పంచాడు.