English | Telugu

శేఖర్ మాస్టర్ ఈరోజు కేసిపిడి అన్న ఆది...ఎలిమినేట్ ఐన సుదర్శన్ మాస్టర్


ఢీ షో ఛాంపియన్ షిప్ బాటిల్ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షో క్వాటర్ ఫైనల్స్ లో టీం ఏ కంటెస్టెంట్స్ తమ డాన్సేస్ తో ఇరగదీసాడు. ఇక ఇందులో ఆది, పండు, జెస్సి స్కిట్స్ కూడా బాగా నవ్వు తెప్పించాయి. పండు రంగురంగుల షర్ట్ వేసుకుని స్టేజి మీదకు వచ్చేసరికి "బుడబుక్కలోడు వచ్చాడు" అన్నాడు శేఖర్ మాస్టర్. "ఢీకి ప్రాక్టీస్ చేయడానికి ఫ్లోర్ చాలా దూరమైపోయింది..అందుకే సెట్ లో ఒక ఇల్లు ఉంది కదా దాన్ని రెంట్ కి అడుగుదాం అనుకుంటున్నా" అని ప్రదీప్ ని అడిగేసరికి ఆది, జెస్సి దగ్గరకు పంపించాడు. "వైజాగ్ లో రూములన్నీ ఇపోయాయా మా రూమ్ మీద పడ్డావ్" అని ఆది సెటైర్ వేసాడు. "మా రూమ్ లో ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి.

డాన్స్ అస్సలు రాకూడదు. అడ్వాన్స్ ఒక లక్ష రూపాయలు కట్టాలి..తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి డబ్బులు ఇస్తేనే తీసుకుంటాం.." అనేసరికి "మనకు రూమ్ కావాలి రిక్వెస్ట్ చేసి అడుగు" అని శేఖర్ మాస్టర్ చెప్పాడు. +"సరే నీకు రెంట్ కి రూమ్ కావాలంటే మా జెస్సిని ఒప్పించు..నువ్వు ఉండడానికే కదా..మీరు ఇద్దరూ కలిసి ఉండడానికి కాదు కదా" అన్నాడు ఆది. ఇక జెస్సి, పండు రూమ్ లోకి వెళ్లి కాసేపు ఓవర్ యాక్షన్ చేసి వచ్చారు. ఈ షోలో శేఖర్ మాస్టర్, శ్రద్దా చేసిన డాన్స్ కి ఈలలు, చప్పట్లు పడ్డాయి. "అసలు మహేష్ బాబు చేసిన డాన్స్ స్టెప్స్ లేవు కదండీ మీకు నచ్చిన స్టెప్స్ అన్నీ చేశారు" కదా అని ఫీలయ్యాడు ఆది. వీళ్ళ డాన్స్ చూసిన ఆది శ్రద్ద కుర్చీలో కూర్చుని "ఈరోజు మీరు చిత్తడి చిత్తడి చేసారు, స్టేజిని రఫ్ఫాడించారు ఇంకాచెప్పాలంటే శేఖర్ మాస్టర్ ఈరోజు కేసిపిడి" అని పొగిడేసాడు. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో గ్రీష్ణ, సోమేష్, సుదర్శన్, రేవంత్ మాస్టర్స్ పోటీ పడ్డారు. ఫైనల్ గా సుదర్శన్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. మిగతా ముగ్గురు ఢీ-15 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.