English | Telugu
లంగావోణీలో అల్లాడించిన ఇంద్రజ..పాతికేళ్ళు వెనక్కి వెళ్లిపోయారంటూ కామెంట్స్
Updated : Dec 9, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ మిగతా కామెడీ షోస్ తో సమానంగా పోటీ పడుతూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే ఈ షోకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఫన్, ఎంటర్టైన్, మెసేజ్ ఒరియెంటెడ్ స్కిట్స్ అన్ని కలగలసిన ఒక అద్భుతమైన కామెడీ షో ఇది. ఈ షోకి రష్మీ యాంకర్ జడ్జి ఇంద్రజ. ఇక ఇప్పుడు రాబోయే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "ముఖచిత్రం" డైరెక్టర్ సందీప్ రాజ్తో కలిసి వచ్చింది హీరోయిన్ ప్రియా వడ్లమాని. హైపర్ ఆది ఆమెను టీజ్ చేయడానికి ట్రై చేసాడు కానీ వర్కౌట్ కాలేదు.
ఇక షోలో భాగంగా.. ఇంద్రజ తన డ్యాన్స్తో స్టేజిని అల్లాడించింది. ఇంద్రజకి ఆల్రెడీ డాన్స్ మీద మంచి పట్టు ఉంది. ఎలాంటి డాన్స్ ని ఐనా అవలీలగా చేసేస్తుంది. రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో తన డ్యాన్స్తో అందరిని ఎంటర్టైన్ చేసి అలరించింది. ప్రియమైన నీకు సినిమాలోని "మనసున ఉన్నది" అనే పాటకు లంగా ఓణీ వేసుకుని డ్యాన్స్ చేసింది ఇంద్రజ.." ఈ పాటతో పాతికేళ్ళు ముందుకెళ్లారు అంత బాగా చేశారు" అని ఆది మంచి కంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత జీన్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని "గజినీ సినిమాలోని.. "రహతుల్ల రహతుల్ల " పాటకు మంచి ఎనెర్జీతో డాన్స్ చేసింది ఇంద్రజ.