English | Telugu

నాతో కుక్క చాకిరీ చేయించుకున్నారు!

సీనియర్ యాంకర్, న‌టి అనితా చౌదరి ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో నటించారు. 'ఛత్రపతి', 'నువ్వే నువ్వే', 'మన్మథుడు' లాంటి సినిమాలు ఈమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. పేరు చివరన చౌదరి అని పెట్టుకున్న ఈ యాంకర్ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ తో పాటు టీవీ ఇండస్ట్రీలోనూ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందనే టాక్ ఎప్పటినుండో ఉంది.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు చాలా వరకు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉండడంతో క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తుంటారనే ప్రచారం ఉంది. అయితే వీటిని ఖండిస్తూ కొంత కాలం క్రితం యాంకర్ అనితా చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవని, చౌదరి అనేసరికి ఊడిగం చేయించుకునేవారని.. త‌న‌తో కుక్క చాకిరీ చేయించారని.. ఆఫీస్ బాయ్ కు ఎక్కువ, యాక్టర్ కి తక్కువ అన్నట్లుగా ఉండేది త‌న‌ పరిస్థితి అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తన పేరు గోగినేని అనిత అని.. కానీ ఈటీవీలో సీరియల్స్ చేసినప్పుడు స్క్రీన్ పై తన పేరుని అనితా చౌదరి అని వేశారని.. ఆ తరువాత అలా కంటిన్యూ అయిపోయిందని చెప్పారు. తన పేరు వెనుక చౌదరి తీసేయమని చెప్పినా.. ఎవరూ వినలేదని.. 'కమ్మ అమ్మాయిలు త్వరగా ఇండస్ట్రీకి రారు.. మీరు వచ్చారు కాబట్టి చౌదరి అని ఉంచుకోండి' అంటూ సలహాలు ఇచ్చారని.. ఈ విషయంలో తన మాట వినలేదని వెల్ల‌డించారు. ఇండస్ట్రీలో కమ్మ వాళ్లే కాకుండా.. అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారని.. తనతో పని చేసిన సుమ చౌదరి కాదని, ఝాన్సీ చౌదరి కాదని.. కానీ అందరం ఒకే ఫ్యామిలీలా ఉన్నామని అనిత తెలిపారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.