English | Telugu

భార్యను గోడకేసి కొట్టిన నటుడి అరెస్ట్‌!

ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్ ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చాడు కరణ్. 'యే రిష్తా క్యా కెహ్లతా హై' అనే సీరియల్‌తో పాపులర్ అయిన కరణ్ ఆ తరువాత పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. చాలా కాలం పాటు నిషాతో డేటింగ్ చేసిన కరణ్ 2012లో ఆమెను పెళ్లాడాడు.

ఈ జంటకు కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కరణ్-నిషా జంటగా 'నాచ్ బలియే' సీజన్ 5లో పాల్గొన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాము బాగానే ఉన్నామని.. ఈ వార్తల్లో నిజం లేదని స్పందించారు. రీసెంట్‌గా కరణ్‌కి కరోనా సోకినప్పుడు.. తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని చెప్పాడు.

అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నిషా తన భర్తపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్ని వారాలుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఇప్పుడు అవి తారా స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఆ సమయంలో కరణ్ ఆవేశంతో నిషా తలను గోడకేసి కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో నిషా పోలీసులను ఆశ్రయించింది. కరణ్‌పై సెక్షన్ 336, 337 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలో త‌న‌ నివాసంలో ఉన్న కరణ్‌ను అరెస్ట్ చేశారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.