English | Telugu

హత్యకు గురైన బిగ్ బాస్ భార్య...  హౌస్‌లోకి పోలీసులు ఎంట్రీ!



బిగ్ బాస్ సీజన్-7 లో ఉల్టా పల్టా ట్విస్ట్ లు మాములుగా లేవుగా... ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి దాకా ఫ్యామిలీ వీక్ అంటు ఎమోషనల్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడేమో ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఇచ్చాడు. అందులో పల్లవి ప్రశాంత్ గెలిచాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోని అమర్ దీప్, అంబటి అర్జున్ ని మినహాయించి మిగతా హౌస్ మేట్స్ కి ఆక్టివిటి ఏరియాలో విందు ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. అయితే అందరు భోజనానికి కూర్చున్నప్పుడు.. ఎక్కువ ఆలోచించకు నీ ఇటుకల తెలివి ఆపేసెయ్ అని రతికతో శివాజీ అంటాడు. పెద్దయ్య ఇందులో ఏం లేదా అని రతిక అనగానే.. నువ్వు అతిగా ఆలోచించకని బిగ్ బాస్ అంటాడు. ఆ తర్వాత అందరు బయటకు వస్తారు. బిగ్ బాస్ హౌస్ లో మీరు విందు చేసే సమయంలో హత్య జరిగిందని, అది ఎవరో కాదు మిసెస్ బిగ్ బాస్ ని ఎవరో హత్య చేశారని కంటెస్టెంట్స్ చెప్పాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లోని వాళ్ళంతా షాక్ అయ్యారు. కాసేపటికి స్టోర్ రూమ్ నుండి అంబటి అర్జున్, అమర్ దీప్ లు ఇద్దరు పోలీసులుగా వచ్చారు. దాంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు.

శివాజీకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి ఈ సీక్రెట్ టాస్క్ ని శివాజీ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిలుస్తాడా లేదా తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మరి హౌస్ లో జరిగిన మిసెస్ బిగ్ బాస్ హత్యను చేసిందెవరో కంటెస్టెంట్స్ కనిపెట్టగలరా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.