English | Telugu

హిస్టరీ రిపీట్ అంటున్న బాలకృష్ణ ..అన్‌స్టాప‌బుల్ యాంథమ్ సీజన్ 2 రిలీజ్

నందమూరి బాలకృష్ణ నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎంతో మందిని అలరించారు..అలరిస్తూనే ఉన్నారు..ఇక ఇప్పుడు ఆహా వారి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో తో హోస్ట్‌గా మారి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2 ద్వారా ఇంకోసారి ఫాన్స్ ని, ఆడియన్స్ ని తనదైన స్టయిల్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోస్‌ను లాంచ్ చేసే ఆహా , ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2’ కోసం టైటిల్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది.

"నేను దిగ‌నంత వ‌ర‌కే" అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. మాస్ ఆడియన్స్ మదిని దోచేలా ఉంది ఈ సాంగ్. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు సీజన్ 2 అక్టోబర్ లో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. అందుకు ముందుగా అన్‌స్టాప‌బుల్ యాంథమ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రోల్ రైడా, మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ రూపొందించారు. బాల‌కృష్ణ‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేయనుంది సీజన్ 2 ..దీంతో సీజ‌న్ 2పై భారీగా ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇండ‌స్ట్రీలోని టాప్ యాక్టర్స్ అంతా ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.